AV Ranganath : 7 ఏళ్ల పోరాటం.. కోర్టు తీర్పుపై గర్వంగా ఉన్నాం
- 7 ఏళ్ల పాటు కొనసాగిన దర్యాప్తు
- 67 మంది సాక్షుల స్టేట్మెంట్ నమోదు
- హత్య వెనుక భారీ సుపారి డీల్
- కోర్టు తీర్పుపై పోలీసులు సంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Ranganath : ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఈ కేసును దర్యాప్తు చేసిన నల్గొండ జిల్లా మాజీ ఎస్పీ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది నిందితులకు కోర్టు శిక్ష విధించడంతో, తాము చేసిన దర్యాప్తుపై గర్వంగా ఉన్నామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో దర్యాప్తును అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించామని రంగనాథ్ తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాలపాటు దర్యాప్తు చేసి, కేసును ఛాలెంజ్గా తీసుకుని నిందితులకు శిక్ష పడేలా చేసామని ఆయన వెల్లడించారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనలసిస్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అన్ని ఆధారాలను సేకరించామని, 9 నెలలపాటు శ్రమించి 1,600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
కేసు విచారణలో భాగంగా 67 మంది సాక్షులను విచారించి, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు. కోర్టులో ఈ స్టేట్మెంట్లన్నీ చాలా కీలకంగా మారాయని, దర్యాప్తు పకడ్బందీగా సాగినట్లు తెలిపారు. ఈ కేసులో సాక్షాలు దొరకకపోయినా, సీసీ ఫుటేజ్ ద్వారా దృఢమైన ఆధారాలు సేకరించినట్లు రంగనాథ్ చెప్పారు. ప్రత్యేక పోలీస్ బృందాలు ఒకే లక్ష్యంతో పని చేసి, నిందితులు తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా వెంటాడి పట్టుకున్నట్లు వివరించారు.
Also Read
హత్యకు ప్రధాన సూత్రధారి మారుతీరావు, కూతురు అమృత తన ప్రేమ వివాహం చేసుకోవడంతో, తన పరువు పోయిందనే ఆగ్రహంతో కోట్ల రూపాయల సుపారితో హత్య చేయించాడని రంగనాథ్ వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితులుగా అక్బర్ అలీ, భారీ, అస్గరలి కీలకంగా ఉన్నారని, వీరిని పట్టుకుని విచారించామని తెలిపారు. హత్య అనంతరం నిందితులు ట్రైన్లో పారిపోడానికి ప్రయత్నించగా, మన పోలీస్ బృందాలు వెంటాడి పట్టుకున్నాయని పేర్కొన్నారు.
ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నామని, కానీ న్యాయాన్ని సాధించే దిశగా పకడ్బందీగా దర్యాప్తు చేశామని, ఈ రోజు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏవీ రంగనాథ్ అన్నారు. భవిష్యత్తులో హానర్ కిల్లింగ్ చేసినా శిక్ష తప్పదని ఈ కేసు రుజువు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..