ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఐదు డెడ్బాడీలు లభ్యమయ్యాయి. గుంటూరులో రెండు, కడప (వైఎస్సార్ జిల్లా)లో మూడు దొరికాయి. గుంటూరులో లభ్యమైన మృతదేహాలు యువతి, యుకుకుడివిగా గుర్తించారు. తెనాలిలోని రైల్వే ట్రాక్పై అనుమానాస్పద స్థితిలో వీరి మృతదేహాలు కనిపించాయి. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని స్థానికులతో పాటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు వేగంగా గుద్దడంతో గుర్తించలేనంతగా వీరి తలలు పగిలాయి. ఐడి కార్డు ఆధారంగా.. ఈ యువ జంట చేబ్రోలు…
కూతురు అంటే లక్ష్మీ దేవితో సమానం. ఆడపిల్ల పుట్టిందంటే, తమ ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ చాలామంది సంబరాలు చేసుకుంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుతారు. ముఖ్యంగా.. తల్లి అయితే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇక నానమ్మ కూడా తల్లిలాగే ప్రేమను పంచుతూ.. గారాబం చేస్తుంది. కానీ.. ఇక్కడ ఓ బాలిక పాలిట మాత్రం తల్లి, నానమ్మలు రాక్షసులయ్యారు. బతికుండగానే శ్మశానంలో వాళ్లు ఆ బాలికను పాతిపెట్టారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ…
వాళ్ళు ముగ్గురున్నారు.. దొంగతనం చేసేందుకు కొన్ని రోజులపాటు ఓ అపార్ట్మెంట్లో రెక్కీ నిర్వహించారు.. ఎట్టకేలకు ఓ ఇంటికి ఎంపిక చేసుకున్నారు.. ఆ ఇంట్లో ఒక్కతే మహిళ ఉంటుందని గమనించి పక్కా ప్లాన్ వేసుకున్నారు.. దాదాపు ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అనుకున్నారు.. ఇంట్లోకి వెళ్లి సామాన్లు దొంగలించడం ప్రారంభించారు.. చివర్లో ఆ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. దీంతో ఆ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే… గుజరాత్ రాష్ట్రం అదాజన్లోని సీకే విల్లా సొసైటీలో…
ప్రస్తుత సమాజంలో చాలామంది పురుషులు వివాహిత సంబంధాలను పెట్టుకుంటూ భార్యలను మోసం చేస్తున్నారు. భార్యలకు అబద్దాలు చెప్పి వేరొక మహిళతో సంబంధం పెట్టుకొని అడ్డంగా బుక్ అవుతున్నారు.
మనోబలం ఉంటే దేన్నైనా ఎదురించొచ్చన్న నానుడిని ఓ మరుగుజ్జు జంట నిరూపించింది. తాము పొట్టిగా ఉన్నంతమాత్రాన చేతకానివాళ్లం కాదని, తమని తక్కువ అంచనా వేయొద్దని చాటిచెప్పారు. తమ ఇంట్లోకి చొరబడిన దొంగను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, పారిపోకుండా కట్టిపడేశారు. ఈ ఘటన బీహార్లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాన్ గ్రామంలో రంజిత్ పాశ్వాన్, సునైనా అనే మరుగుజ్జు దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల అర్థరాత్రి…
అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాకపోతే సిబ్బంది ఇచ్చిన మద్యం మాత్రమే తాగాలి. అఫ్కోర్స్ దానికి డబ్బులు కట్టాలనుకోండి. అది వేరే విషయం. విమానంలో మనం తీసుకెళ్లిన మందు తాగుతానంటే నిబంధనలు ఒప్పుకోవు. సేఫ్టీ, సెక్యూరిటీ రీత్యా బయటి మద్యాన్ని అనుమతించట్లేదు. కానీ.. రూల్స్ పాటిస్తే వాళ్లు మందుబాబులు అని ఎందుకు అనిపించుకుంటారు. లేటెస్టుగా ఢిల్లీ నుంచి లండన్కి వెళుతున్న ఓ విమానంలో ఇదే జరిగింది. వెంట తెచ్చుకున్న జిన్ బాటిల్లోని డ్రింగ్ని…
హైదరాబాద్లో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. తన తండ్రి పట్ల కర్కశంగా వ్యవహరించాడో కుమారుడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కిరాతకంగా కొట్టిచంపాడు. జీడిమెట్లలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో సత్యనారాయణ (63) అనే వ్యక్తి ఐదేళ్లుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నాడు.. పక్షవాతంబారినపనడి మంచానికే పరిమితం అయ్యాడు.. అయితే, మద్యం మత్తులో తండ్రితో గొడవపడిన సురేష్ అనే కుమారుడు.. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి కర్రతో, బెల్ట్తో సత్యనారాయణపై దాడికి…
ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నాగేశ్వరరావు చేయని ప్రయత్నాలు లేదని విచారణలో బయటపడింది. మరోవైపు కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి తోడు బాధితురాలు ఇల్లుతో పాటుగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారు. సంఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నారు? ఏంటి అనే విషయాన్ని పోలీసులు…
రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె భర్తని తుపాకీతో బెదిరించాడు. చివరికి విధి రాసిన వింత నాటకంలో అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి పేరు నాగేశ్వరరావు. మారేడుపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన హస్తినాపురంలో నివనిస్తోన్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన సీఐ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన భర్త…