Boy Harassed By Friends: స్నేహితుల చేత లైంగిక వేధింపులకు గురైన పదేళ్ల బాలుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Harassed By Friends: సమాజంలో మృగాళ్ల నుంచి బాలికలకే కాదు.. బాలురకూ రక్షణ లేకుండా పోతోంది. ఢిల్లీలో 10 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, కర్రలతో దారుణంగా కొట్టి చంపేందుకు యత్నించి, వదిలేసి వెళ్లిపోయారు. బాధిత బాలుడి ప్రైవేటు భాగాల్లో మృగాళ్లు రాడ్ కూడా చొప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గత నెలలో దేశరాజధాని ఢిల్లీలో జరగగా.. ఇవాళ ఆ బాలుడు మృతిచెందాడు. గత నెలలో బంధువుతో సహా ముగ్గురు స్నేహితులచే లైంగిక వేధింపులకు, క్రూరత్వానికి గురైన 10 ఏళ్ల ఢిల్లీ బాలుడు ఢిల్లీ ప్రభుత్వ లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి(ఎల్ఎన్జేపీ)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణానికి పాల్గొన్న పిల్లలందరూ 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే కావడం గమనార్హం. వీరంతా ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీలంపూర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిసింది.
కొన్ని నివేదికల ప్రకారం, బాలుడి గాయాలు చాలా భయంకరంగా ఉన్నాయని వైద్యులు నివేదించారు. వారు డిసెంబర్ 16, 2012 గ్యాంగ్ రేప్ను గుర్తుకు తెచ్చిందని ఈ ఘటన గురించి వివరించారు. మూడు రోజుల క్రితం జరిగిన భౌతిక దాడి కారణంగా సుమారు 10 సంవత్సరాల వయస్సు గల బాలుడిని చేర్చుకున్నట్లు ఎల్ఎన్జేపీ ఆసుపత్రి నుంచి సెప్టెంబర్ 22న సీలంపూర్ పోలీస్ స్టేషన్కు కాల్ వచ్చింది. పోలీసు బృందం ఆసుపత్రికి చేరుకుని పిల్లల తల్లిదండ్రులతో సమావేశమైందని, అయితే వారు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత చిన్నారిని వైద్యుల పరిశీలనలో ఉంచారు.
Also Read
New Rules: డెబిట్, క్రెడిట్ కార్డ్లు వాడే వారికి అలెర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్..
ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పోలీసులకు నోటీసులు జారీ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తన కుమారుడి వ్యక్తిగత భాగాల్లో రాడ్ని కూడా చొప్పించిన వ్యక్తులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక మహిళ నుండి ఫిర్యాదు అందిందని కమిషన్ తెలిపింది. నాలుగు రోజులుగా కుటుంబసభ్యులు బాలుడిని ఆస్పత్రికి తీసుకురాకపోవడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు చెబుతున్నారు. సెప్టెంబరు 24 వరకు కుటుంబం వాంగ్మూలం ఇవ్వలేదు. పోలీసులు ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ తర్వాత, బాలుడి తల్లి చివరికి తన కొడుకును అతని ముగ్గురు స్నేహితులు శారీరకంగా దాడి చేసి, సకాలంలో తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారనే కారణంతో అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారని వెల్లడించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు తన కొడుకును ఇటుకలు, రాడ్లతో కొట్టారని ఆ మహిళ పేర్కొంది. బాలుడిపై దాడి చేసిన బంధువుతో సహా ఇద్దరు పిల్లలను పట్టుకుని జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరుపరిచారు. పోలీసులు మరొక బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
-
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!