జింబాబ్వే జరుగుతున్న చివరి టీ20లో భారత్ 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే ముందు 168 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు.
ఇండియా-జింబాబ్వే మధ్య ఈరోజు ఐదో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్కు దిగనుంది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.
బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు.
ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. భారత్- శ్రీలంక మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. అయితే.. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధృవీకరించింది.
జింబాబ్వేతో టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పుడు మూడో మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 183 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్(66), రుతురాజ్(49)లు రాణించారు.
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
IND vs PAK: 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్ని బుధవారం ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) సమర్పించింది. మార్చి 1న లాహోర్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
టీమిండియా ఈరోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ కారణంగా ఈ టూర్కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ టీమ్లోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో సత్తా చాటిన ప్లేయ్లకు అవకాశం కల్పించారు. అలాగే.. జట్టు కెప్టెన్సీ పగ్గాలు శుభ్మన్ గిల్ చేతికి అందించారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గిల్ జట్టుతో కలిసి జింబాబ్వే వెళ్లలేదు. టీమిండియా జింబాబ్వే పర్యటనకు సంబంధించి బీసీసీఐ తన X హ్యాండిల్ తెలిపింది. NCA చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్…
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ట్రోఫీని తీసుకున్నారు. 140 కోట్ల మంది దేశప్రజల ఆనందానికి అవధులు లేవు.