Cricket: ఒకే మ్యాచ్లో మూడుసార్లు ‘టై’.. ఇంతకీ ఏ మ్యాచ్ అంటే..?
- ఒకే మ్యాచ్లో మూడుసార్లు 'టై'
- కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీ
- బెంగళూరు బ్లాస్టర్స్.. హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై
- చివరి సూపర్ ఓవర్ లో విజయం సాధించిన హుబ్లీ జట్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఇరు జట్లు ఒకే స్కోరును చేస్తే.. ఆ మ్యాచ్ టై అవుతుంది. మళ్లీ తిరిగి సూపర్ ఓవర్ పెడుతారు. అలా.. ఒకే మ్యాచ్లో మూడుసార్లు టై అయింది. ఇంతకీ ఎక్కడా.. ఏ మ్యాచ్ అనుకుంటున్నారా..?. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 17వ మ్యాచ్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై అయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న హుబ్లీ టైగర్స్ 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. బెంగళూరు బ్లాస్టర్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో.. మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్కు వెళ్లారు. అయితే ఇక్కడ కూడా రెండుసార్లు సూపర్ ఓవర్ టై అయింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్లో చివరి బంతికి హుబ్లీ టైగర్స్ జట్టు విజయం సాధించింది.
Home Minister Anitha: అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి
Also Read
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
కాగా.. మొదటిసారి మ్యాచ్ టై అయిన తర్వాత రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. అందులో కూడా టైగా ముగిసింది. బెంగళూరు బ్లాస్టర్స్ తొలి సూపర్ ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. బరిలోకి దిగిన హుబ్లీ జట్టు 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. టైగా ముగిసింది. మళ్లీ రెండో సూపర్ ఓవర్ జరగ్గా ఇందులో హుబ్లీ తొలుత బ్యాటింగ్ చేసి 8 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు కూడా ఒక వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్లో బెంగళూరు బ్లాస్టర్స్ 13 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో.. హుబ్లీ జట్టు సూపర్ ఓవర్లో చివరి బంతికి ఫోర్ కొట్టి 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. రెండు సూపర్ ఓవర్లు కూడా టైగా ముగిసిన తర్వాత.. మూడో సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం తేలింది.
Kolkata doctor case: సందీప్ ఘోష్కు సీఎం మమత బర్త్డే విషెస్ చెప్పిన లేఖ వైరల్
తాజావార్తలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
-
Honor X7e Plus 5G: హానర్ X7e ప్లస్ 5G రిలీజ్.. 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 చిప్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!