Cricket: ఒకే మ్యాచ్లో మూడుసార్లు ‘టై’.. ఇంతకీ ఏ మ్యాచ్ అంటే..?
- ఒకే మ్యాచ్లో మూడుసార్లు 'టై'
- కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీ
- బెంగళూరు బ్లాస్టర్స్.. హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై
- చివరి సూపర్ ఓవర్ లో విజయం సాధించిన హుబ్లీ జట్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఇరు జట్లు ఒకే స్కోరును చేస్తే.. ఆ మ్యాచ్ టై అవుతుంది. మళ్లీ తిరిగి సూపర్ ఓవర్ పెడుతారు. అలా.. ఒకే మ్యాచ్లో మూడుసార్లు టై అయింది. ఇంతకీ ఎక్కడా.. ఏ మ్యాచ్ అనుకుంటున్నారా..?. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 17వ మ్యాచ్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై అయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న హుబ్లీ టైగర్స్ 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. బెంగళూరు బ్లాస్టర్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో.. మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్కు వెళ్లారు. అయితే ఇక్కడ కూడా రెండుసార్లు సూపర్ ఓవర్ టై అయింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్లో చివరి బంతికి హుబ్లీ టైగర్స్ జట్టు విజయం సాధించింది.
Home Minister Anitha: అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
కాగా.. మొదటిసారి మ్యాచ్ టై అయిన తర్వాత రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. అందులో కూడా టైగా ముగిసింది. బెంగళూరు బ్లాస్టర్స్ తొలి సూపర్ ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. బరిలోకి దిగిన హుబ్లీ జట్టు 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. టైగా ముగిసింది. మళ్లీ రెండో సూపర్ ఓవర్ జరగ్గా ఇందులో హుబ్లీ తొలుత బ్యాటింగ్ చేసి 8 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు కూడా ఒక వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్లో బెంగళూరు బ్లాస్టర్స్ 13 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో.. హుబ్లీ జట్టు సూపర్ ఓవర్లో చివరి బంతికి ఫోర్ కొట్టి 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. రెండు సూపర్ ఓవర్లు కూడా టైగా ముగిసిన తర్వాత.. మూడో సూపర్ ఓవర్ లో మ్యాచ్ ఫలితం తేలింది.
Kolkata doctor case: సందీప్ ఘోష్కు సీఎం మమత బర్త్డే విషెస్ చెప్పిన లేఖ వైరల్
తాజావార్తలు
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?