Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ పై ‘మర్డర్ కేసు’ నమోదు..
- షకీబ్ అల్ హసన్పై మర్డర్ కేసు నమోదు
- రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్న షకీబ్
- మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం..
- గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్పై ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్పై మర్డర్ కేసు నమోదైంది. కాగా.. రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో షకీబ్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్లో భాగం. అయితే.. షకీబ్ రెండో టెస్టు మ్యాచ్ ఆడుతాడా లేదా అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
Read Also: Jogi Rajeev: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు బెయిల్
Also Read
శుక్రవారం విడుదల చేసిన ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో క్రికెటర్ షకీబ్ను 28వ నిందితుడిగా.. నటుడు ఫిర్దౌస్ అహ్మద్ను 55వ నిందితుడిగా చేర్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు.
United Nations: మోడీ పర్యటనతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!.. ఐరాస చీఫ్ ఆశాభావం
కోర్టు ప్రకటన ప్రకారం.. ఆగస్ట్ 5న రూబెల్ అడాబోర్లోని రింగ్ రోడ్లో నిరసన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రూబెల్ ఛాతీ, కడుపులో బుల్లెట్లు తగిలాయి. దీంతో.. తీవ్రంగా గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 7న మృతి చెందాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!