Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ పై ‘మర్డర్ కేసు’ నమోదు..
- షకీబ్ అల్ హసన్పై మర్డర్ కేసు నమోదు
- రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్న షకీబ్
- మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం..
- గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్పై ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్పై మర్డర్ కేసు నమోదైంది. కాగా.. రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో షకీబ్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్లో భాగం. అయితే.. షకీబ్ రెండో టెస్టు మ్యాచ్ ఆడుతాడా లేదా అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
Read Also: Jogi Rajeev: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు బెయిల్
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
శుక్రవారం విడుదల చేసిన ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో క్రికెటర్ షకీబ్ను 28వ నిందితుడిగా.. నటుడు ఫిర్దౌస్ అహ్మద్ను 55వ నిందితుడిగా చేర్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు.
United Nations: మోడీ పర్యటనతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!.. ఐరాస చీఫ్ ఆశాభావం
కోర్టు ప్రకటన ప్రకారం.. ఆగస్ట్ 5న రూబెల్ అడాబోర్లోని రింగ్ రోడ్లో నిరసన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రూబెల్ ఛాతీ, కడుపులో బుల్లెట్లు తగిలాయి. దీంతో.. తీవ్రంగా గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 7న మృతి చెందాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!