Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ పై ‘మర్డర్ కేసు’ నమోదు..
- షకీబ్ అల్ హసన్పై మర్డర్ కేసు నమోదు
- రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్న షకీబ్
- మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం..
- గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్పై ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్పై మర్డర్ కేసు నమోదైంది. కాగా.. రావల్పిండిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో షకీబ్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్లో భాగం. అయితే.. షకీబ్ రెండో టెస్టు మ్యాచ్ ఆడుతాడా లేదా అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.
Read Also: Jogi Rajeev: జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఏసీబీ కోర్టు బెయిల్
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
శుక్రవారం విడుదల చేసిన ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. మృతుడు రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం గురువారం ఢాకాలోని అడ్బోర్ పోలీస్ స్టేషన్లో షకీబ్ అల్ హసన్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో క్రికెటర్ షకీబ్ను 28వ నిందితుడిగా.. నటుడు ఫిర్దౌస్ అహ్మద్ను 55వ నిందితుడిగా చేర్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు.
United Nations: మోడీ పర్యటనతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!.. ఐరాస చీఫ్ ఆశాభావం
కోర్టు ప్రకటన ప్రకారం.. ఆగస్ట్ 5న రూబెల్ అడాబోర్లోని రింగ్ రోడ్లో నిరసన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రూబెల్ ఛాతీ, కడుపులో బుల్లెట్లు తగిలాయి. దీంతో.. తీవ్రంగా గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 7న మృతి చెందాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?