క్రికెట్లో మన్కడింగ్ పలు మార్లు ఎలాంటి వివాదాలను సృష్టించిందో గతంలో ఎన్నో సార్లు చూశాం. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్ స్ట్రైకర్ ముందే క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు. అయితే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో మెల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వివాదాలకు కారణమయ్యే మన్కడింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. బౌలింగ్ సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న ఆటగాడు పరుగు కోసం సిద్ధంగా ఉండాలి కాబట్టి అందులో భాగంగానే…
మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీపైనే అందరీ కళ్లు ఉన్నాయి. మొహాలీ వేదికగా జరిగే టెస్టులో… సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు… మరో 38 పరుగులు చేస్తే… 8వేల పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నారు. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరంద్ర సెహ్వాగ్… దేశం తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న రెండో వన్డేలోనూ భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. రెండో వన్డేలో వెస్టిండీస్ను 44 పరుగుల తేడాతో ఓడించి.. 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. 238 పరుగుల ఛేదనలో, వెస్టిండీస్ జట్టు విఫలం అయ్యింది… టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి.. విండీస్కు ముందు 238 పరుగుల…
దేశంలో క్రికెట్ కు ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గేమ్ ఇంగ్లాండ్లో పుట్టినప్పటికీ ఉపఖండంలోనే ఫేమస్ అయింది. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల పెద్దవాళ్ల వరకు క్రికెట్ను అమతంగా ఇష్టపడుతుంటారు. పెద్దవాళ్లు సైతం అప్పుడప్పుడు బ్యాట్ చేతపట్టి వావ్ అనిపిస్తుంటారు. ఇలానే ఓ పెద్దాయన బ్యాట్ పట్టుకొని కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోమని చెబుతూ క్రికెట్ అడాడు. పరుగులు తీశాడు. బ్యాట్ పట్టింది మొదలు ఆ పెద్దాయన తన వయసును మర్చిపోయి…
దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్లో క్రికెట్కు చోటు దక్కింది. 1998లో కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు అధికారులు చోటు కల్పించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఈసారి క్రికెట్లో మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. Read Also: ఐపీఎల్ ఆటగాళ్ల…
వయస్సు పైబడినా.. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేకపోతున్నా.. విమర్శలు ఎదురైనా.. జట్టులోనే ఉండాలి.. క్రికెట్ ఆడుతూనే ఉండాలని భావించే క్రికెటర్లు ఎందరో ఉన్నారు.. ఫిట్నిస్ కోల్పోయి.. జట్టుకు దూరమైనా.. మళ్లీ వారి ప్రయత్నాలు సాగిస్తూ వస్తుంటారు.. అయితే, ఓ స్టార్ క్రికెట్ దానికి విరుద్ధం.. 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు.. అతడే నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బెన్ కూపర్.. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పేశాడు. Read Also: సర్కార్ సంచలన నిర్ణయం..!…
టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.. జట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గడ్డపై ఆడలేకపోయారో.. లేక కోవిడ్ టెన్షన్ ఏమైనా పట్టుకుందో తెలియదు కాని.. మన వాళ్లు ప్రతీ మ్యాచ్లోనూ ఓటమిపాలయ్యారు.. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను మరో వన్డే మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. చివరిదైన మూడో వన్డేలోనూ భారత్కు అవకాశం ఇవ్వలేదు.. కాకపోతే, ఈ మ్యాచ్ టీమిండియా గొప్ప ఆటతీరును కనబర్చింది.. ఒక రకంగా చెప్పాలంటే పోరాడి ఓడిపోయింది.. Read Also:…
భారత్లో సినిమాలు, క్రికెట్ను వేరు చేసి చూడలేం. ఐపీఎల్ ప్రాంరంభమైనప్పటి నుంచి ఐపీఎల్ జరిగినన్ని రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ ఇది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం వచ్చే నెలలో జరగబోతుంది. ఇందుకోసం ఆటగాళ్ల పూర్తి జాబితా వచ్చేసింది. ఈ లీగ్ కోసం 1,214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా 318 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 10 జట్లు…
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్కు దూరం కావడంతో……
దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో…