వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈ రోజు 23వ మ్యాచ్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ ఆఫ్ఘాన్ ఆలౌరౌండ్ ప్రదర్శన చూపించింది. దీంతో సూపర్ విక్టరీని అందుకుంది. ఇదిలా ఉంటే.. తమ జట్టు ఓటమిపై కెప్టెన్ బాబర్ ఆజం స్పందించారు.
వన్డే వరల్డ్ కప్లో మరో సంచలన విజయం నమోదైంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై అఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. 283 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ 49 ఓవర్లలో సునాయాసంగా చేధించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(77) కన్నుమూశారు. బిషన్ సింగ్ బేడీ టీమిండియాలో గొప్ప స్పిన్నర్. అతను 1946 25 సెప్టెంబర్ న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్ ల్లో విన్నర్గా నిరూపించుకున్నాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే చివరకు ఆడి 95 పరుగులు చేసి ఔటవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంకో…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.
ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఆడి కష్టాల్లో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. తాజాగా.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ప్రపంచకప్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రీస్ టోప్లీ వేలికి గాయమైంది. దీంతో మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ వరల్డ్ కప్లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఏడ్చేశారని సంజయ్ బంగర్ చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 273 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు.