డిసెంబర్లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు.
ప్రపంచకప్ 2023లో భారత జట్టు అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతోంది. మొత్తం 5 మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేనకు తదుపరి సవాలు ఆదివారం ఇంగ్లాండ్తో జరిగే మ్యాచే. ఇంగ్లండ్ 5 మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయింది.
ప్రపంచకప్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓ వైపు వరల్డ్కప్ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతుండగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అశుభం చోటుచేసుకుంది. గురువారం నాడు ఈడెన్ గార్డెన్ స్టేడియం బయటి గోడలో కొంత భాగం కూలిపోయింది. వీటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
023 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఈనెల 29న లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్ లక్నోలో భారీ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది.
భారత జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీలో అనేక సిరీస్లు, ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్లే దీనికి నిదర్శనం. ఐపీఎల్ 2023లో అభిమానులు ధోనీ కోసం హంగామా చేశారు. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
వన్డే వరల్డ్ కప్లో గొప్ప టీమ్లు కూడా బోల్తాపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు కూడా పసికూన జట్ల ముందు బోర్లాపడుతోంది. ఆఖరికి అఫ్గానిస్తాన్ జట్టుపై కూడా చిత్తుగా ఓడి వరుస ఓటములను మూటగట్టుకుంది. ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ జట్టు.. కేవలం రెండు మ్యాచ్ల్లోనే గెలిచి మూడింట్లో ఓటమి పాలైంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్ జట్టు దీన్ని సద్వినియోగం చేసుకోలేక 156 పరుగులకే ఆలౌటైంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకపై ఇంగ్లండ్కి ఎదురైన ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.