అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. సోమవారం కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు.
తాజా ప్రపంచకప్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ టీమ్ కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగనున్న కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి రానున్నట్లు సమాచారం.
అబ్బాయిల వల్ల కానీ పనిని అమ్మాయిలు చేశారు. దాంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 427 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
హైదరాబాద్లో ఉన్న పాక్ జట్టు పూర్తి ఫుడ్ మెనూను వెల్లడించింది. ఇందులో చికెన్, మటన్ నుంచి గ్రిల్డ్ ఫిష్ వరకు అన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల ఆహారంలో ప్రోటీన్ ఉంచడం, గ్రిల్డ్ లాంబ్ చాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్లను చేర్చారు. అంతేకాకుండా ప్రోటీన్ల కోసం చికెన్, మటన్, చేపలు అడిగారట. ఇదేకాకుండా.. కార్బోహైడ్రేట్ల కోసం ఉడికించిన బాస్మతి బియ్యం, స్పఘెట్టి బోలోగ్నీస్ సాస్, వెజిటేరియన్ పులావ్ వండమని చెఫ్ కు చెప్పారు.
వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లు ప్రారంభానికి ఇంకెంతో సమయం లేదు. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచకప్ కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుండి పూర్తిగా కోలుకోలేక మొత్తం టోర్నమెంట్కు దూరమయ్యాడు ఆల్ రౌండర్ అష్టన్ అగర్.
శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్ కు ఆ స్టార్ ప్లేయర్ దూరం కానున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. శ్రీలంక మెయిన్ స్పిన్నర్ వనిందు హసరంగా. అతని గాయంపై మెడికల్ ప్యానెల్ హెడ్ అర్జున డి సిల్వా అప్డేట్ ఇచ్చాడు.
తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్కు రానుంది.