IND vs PAK: ఇండియాకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. పాక్ సర్కార్ అనుమతి
మాములుగానే ఇండియా-పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఫ్యాన్స్ కు పండుగే పండగ. అలాంటిది వరల్డ్ కప్ లో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైఓల్టేజే. అయితే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇండియాకు వచ్చేదానిపై స్పష్టత లేదు. తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్కు రానుంది. గతంలో 2016 టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్లో పర్యటించింది. అయితే అక్టోబరు 14న వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Kunamneni Sambasiva Rao : దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది
Also Read
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జట్టును భారత్కు పంపే నిర్ణయాన్ని ప్రకటించింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. క్రీడలు మరియు రాజకీయాలను కలపడం ఇష్టం లేదని, అందుకే ప్రపంచ కప్ 2023 కోసం తమ జట్టును భారత్కు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు రెండు దేశాల మధ్య క్రీడలకు సంబంధించిన విషయాల్లోకి రాకూడదని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచకప్కు జట్టును పంపడంపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భుట్టోతో సహా చాలా మంది మంత్రులు జట్టును భారతదేశానికి పంపడానికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతే టీమ్ ను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Devil : విడుదల తేదిని ఫిక్స్ చేసిన మేకర్స్
మరోవైపు పాకిస్తాన్ జట్టుకు పటిష్ట భద్రతకు సంబంధించి ఐసిసికి వ్రాతపూర్వక హామీ ఇవ్వడం గురించి సమావేశంలో చర్చించారు. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తన ప్రకటనలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. తమ జట్టు భద్రతపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని.. ఈ విషయాన్ని ఐసీసీ, భారత అధికారులకు కూడా తెలియజేశామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తమ జట్టు భారత పర్యటనలో పూర్తి భద్రత ఉంటుందని తెలపగా.. పాక్ ప్రభుత్వం ఇండియాకు పంపేందుకు అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!