Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్లోనే సత్తా…
IPL 2023: ఐపీఎల్కు ఇంకా చాలానే సమయం ఉంది. అయినా పలు జట్లు ఇప్పటి నుంచే టైటిల్ వేటను ప్రారంభించాయి. ఈ సందర్భంగా పలు మార్పులను చేపట్టాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్కు కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కోచ్ మారనున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్ హెడ్ కోచ్గా సేవలు అందించిన న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్కల్లమ్ ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ కొత్త కోచ్ను నియమించింది. ఈ మేరకు టీమిండియా…
Team India: వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నాలుగేళ్లలో భారత్ భారీ స్థాయిలో మ్యాచ్లను ఆడబోతోంది. 2023, మే నుంచి 2027, ఏప్రిల్ మధ్య 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. ఇవి కాకుండా ఐసీసీ ఈవెంట్లు అదనం. అంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలు…
Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు అభిమానుల్లో తెలియని భావోద్వేగం చోటు చేసుకుంటుంది. దీంతో అది ఎలాంటి మ్యాచ్ అయినా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆసియాకప్లో ఈనెల 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో మైదానంలో యుద్ధం లాంటి వాతావరణాన్ని చూడాలని అభిమానులు…
IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్ ట్రాఫోర్డులో లాంక్షైర్కు ఆడుతూ ఓ మ్యాచ్లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని…
ICC Posted Dhoni Video: టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు పూర్తవుతోంది. 2020, ఆగస్టు 15న ధోనీ తన రిటైర్మెంట్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ రిటైర్మెంట్కు రెండేళ్లు పూర్తి కావడంతో ఐసీసీ ప్రత్యేక నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోనీకి సంబంధించిన కొన్ని చిరస్మరణీయ స్మృతులను చూపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్,…
Zimbabwe: ప్రస్తుతం టీమిండియా వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతోంది. ఈనెల 18 నుంచి జింబాబ్వే గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే జింబాబ్వే ఇటీవల జోరు మీద కనిపిస్తోంది. బంగ్లాదేశ్ జట్టుపై టీ20, వన్డే సిరీస్లను కైవసం చేసుకుని తాము బలహీనం కాదని టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆల్రౌండర్ ఇన్నోసెంట్ కియా టీమిండియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తాము భారత జట్టుకు పోటీ ఇవ్వడం కాదని… చుక్కలు చూపిస్తామని ధీమా…
Asia Cup 2022: ఈనెల 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాది దేశాలు ఇప్పటివరకు తలపడలేదు. దీంతో ఈ మ్యాచ్పై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల తేదీని…
Team india bowler Natarajan: టీమిండియా కీలక బౌలర్ నటరాజన్ ఇటీవల జట్టులో కనిపించడం లేదు. దీంతో నటరాజన్కు ఏమైందని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. టీమిండియా బిజీ బిజీగా పలు దేశాల్లో పర్యటిస్తున్నా నటరాజన్కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే నటరాజన్ ఫిట్గా లేకపోవడమే అతడిని ఎంపిక చేయకపోవడానికి కారణమని తెలుస్తోంది. 2020 ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్న నటరాజన్ అరంగేట్ర సిరీస్లోనే అదరగొట్టాడు. నెట్ బౌలర్గా ఆస్ట్రేలియా పర్యటనకు…
Asia Cup 2022: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు 10 శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు ముందు కొత్త కాంట్రాక్టులు ప్రకటించిన పీసీబీ ఇప్పుడు వేతనాలను పెంచడం గమనించదగ్గ విషయం. మొత్తం 33 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టులు పొందగా.. పీసీబీ తాజాగా పెంచిన జీతాల…