Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆసియా కప్ తరహాలోనే టీ20 ప్రపంచకప్కు కూడా టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. గాయం కారణంగా ఆసియా కప్కు దూరమైన స్టార్ పేసర్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు జట్టును…
Mahendra Singh Dhoni: ఇండియాలో ఐపీఎల్ టోర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్కు ప్రపంచంలో ఎక్కడ లేనంత క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కూడా ఐపీఎల్ తరహాలో ఓ టోర్నీని నిర్వహించాలని తలపెట్టింది. ఈ మేరకు ఈ టోర్నీలోకి పలు దేశాల స్టార్ ఆటగాళ్లను ఆహ్వానిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దక్షిణాఫ్రికా…
Shikar Dhawan Allegations on Team Selection: ఈనెల 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భారత జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్కు తనను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేయడం లేదో అర్ధం కావడం లేదన్నాడు. అయితే ఈ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని.. వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా…
Harshal Patel Injured Before Asia Cup: ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శనతో 32 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన హర్షల్ పటేల్.. టీ20 స్పెషలిస్ట్గా భారత జట్టులోకి వచ్చాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో హర్షల్ పటేల్ను అందరూ…
IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లోనూ వెస్టిండీస్పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5…
Heath Davis Sensational Statement: న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ హీత్ డేవిస్ (50) సంచలన ప్రకటన చేశాడు. ఇన్నాళ్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్యంగా ఉంచిన ఓ విషయాన్ని రివీల్ చేశాడు. తాను స్వలింగ సంపర్కుడిని (గే) అని హీత్ డేవిస్ వెల్లడించాడు.ఈ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసని అతడు తెలిపాడు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తానే కుమిలిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక…
IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా…
IND Vs WI: బస్టెర్రె వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. అభిమానులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరింది. మ్యాచ్ జరిగే బస్టెర్రెలోని వార్నర్ పార్క్కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి…
Dhoni Record Breaks: కామన్వెల్త్ గేమ్స్లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆదివారం దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ రికార్డు సృష్టించింది. దీంతో…
Common Wealth Games 2022: ఇంగ్లండ్లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ పోటీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్పైనే ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్ను 18 ఓవర్లకు…