Oval Stadium: క్రికెట్ మైదానాన్ని కప్పేసిన మంచు.. హిమాలయాలను తలపిస్తున్న స్టేడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oval Stadium: ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది. భారత్లోనే కాదు ఇంగ్లండ్లోనూ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. క్రిస్మస్కు ముందే లండన్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. అటు యూకేలోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 10-12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదానాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఓవల్ మైదానం హిమాలయాలను తలపిస్తుందని, అసలు ఇది క్రికెట్ గ్రౌండ్ అని ఎవ్వరూ అనరని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓవల్ మైదానంలో క్రికెట్కు బదులు ఐస్ హాకీ ఆడుకోవచ్చని పలువురు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Read Also: ఈ అలవాట్లు ఉంటే బెడ్రూంలో వీక్ అయిపోతారు.. జాగ్రత్త..!!
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
కాగా 1845లో ఓవల్ మైదానాన్ని నిర్మించారు. ఈ స్టేడియంలో 23,500 మంది మ్యాచ్ను వీక్షించవచ్చు. 1880లో ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన రెండో మైదానంగా ఓవల్ గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఇంగ్లండ్ ఓవల్ మైదానం వేదికగా ఓ టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ జరగనున్నాయి. అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానంలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్లో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ను ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
The OVAL – under snow. pic.twitter.com/LQmDCQugLc
— Azhar Mahmood (@AzharMahmood11) December 12, 2022
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!