దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు రోజుకు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, చెన్నైలో ఈ కేసులు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి. చెన్నై నగరంలో ప్రస్తుతం 50 వేల వరకు పాజిటివ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో నగరంలోని కరోనా…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో…
స్వరరాగ గంగా ప్రవాహమే అని జేసుదాసు పాడితే పరవశించిపోయిన ఈ దేశంలో ఇప్పుడు శవగంగా ప్రవాహం చూశావా రాజా అని ప్రశ్నించే విషాదాన్ని సృష్టించిన వారెవరు? పరవశాన శిరసూగంగా తలకు జారెనా శివగంగ అని శంకరశాస్త్రి గానం చేసిన శివగంగను శవగంగగా మార్చిన వారెవరు? సెకండ్ వేవ్ అనే కరోనా మలిదెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతుంటే ప్రాణవాయువును అందించలేని ఘోర దురవస్థ రావడానికి కారకులెవరు?ప్రపంచానికే వాక్సిన్ అందించే ఔషద రాజధానిగా దేశాన్ని మార్చామని గొప్పు…
ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్…
భారత మాజీ మహిళా క్రికెటర్ తల్లి కరోనా ట్రీట్మెంట్ కోసం తన వంతు సాయం అందించాడు విరాట్ కోహ్లీ. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడు చికిత్స కోసం రూ.6.77 లక్షలను కోహ్లీ విరాళంగా ఇచ్చాడు. తనకు సాయం చేసినందుకు ఆ మహిళా క్రికెటర్, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. స్రవంతి నాయుడు తల్లి ఎస్కే సుమన్ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసి…
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండడంతో.. మహమ్మారి కట్టడికి అన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అందులో కేసులు భారీగా వెలుగు చూస్తున్న రాష్ట్రాలు లాక్డౌన్కు పూనుకున్నాయి.. కరోనా కంట్రోల్ కాకపోవడంతో.. మళ్లీ లాక్డౌన్ను పొడిగిస్తూ వస్తున్నాయి.. ఇక, లాక్డౌన్ ను మే 31వ తేదీ వరకు తాజాగా నిర్ణయం తీసుకుంది నాగాలాండ్ ప్రభుత్వం.. కరోనా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల ఏమాత్రం లేకపోవడంతో లాక్డౌన్ పొడిగింపునకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, లాక్డౌన్ నుంచి…
కరోనా పేరు చెబితేనే అంతా ఉలిక్కిపడుతున్నారు.. కరోనా సోకిందంటే నా అనేవాళ్లు కూడా మళ్లిచూసే పరిస్థితి లేకుండా పోయింది.. ఈ మహమ్మారిని తిట్టుకోని దేశం ఈ ప్రపంచంలో లేకుండొచ్చు.. అయితే, దీనిని క్యాష్ చేసుకునేవాళ్లు సైతం లేకపోలేదు.. ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ ఆస్పత్రులు అందినకాడికి పిండుకునే పనిలోపడిపోయాయి. మరోవైపు.. అంతా దెయ్యంగా చూస్తున్న కరోనా వైరస్ను దేవతగా భావించేవారు కూడా లేకపోలేదు.. తమిళనాడులో ఏకంగా 48 అడుగుల కరోనా వైరస్ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించారు.. కోయంబత్తూరులోని కామత్చిపురిలోని…
కరోనా నివారణ చర్యల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది.. ప్రభుత్వాలకు ఇది భారంగా కూడా మారుతోంది.. అయితే, కరోనా కట్టడి చర్యలకు సాయం అందించడానికి మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నాయి పలు సంస్థలు.. తాజాగా, కియా మోటార్స్ తన వంతు సాయం ప్రకటించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్టీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన పత్రాలను అందజేశారు కియా ప్రతినిధులు. ఈ నిధులను…
కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథలైతే ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనుండగా.. అల్పాదాయ…