కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఇబ్బందులకు గురవుతోంది. కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఇక ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇవి వివిధ వేరియంట్లపై ఎలా పనిచేస్తాయి..ఎంతకాలం రక్షణ ఇస్తాయనే విషయంపై స్పష్టత లేదు. తాజాగా యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్…
ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య 20 వేలను దాటుతోంది. వరుసగా మూడో రోజు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. దీంతో పాటు మరనణాల సంఖ్య, రికవరీల సంఖ్య కూడా పెరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. అయితే కొన్ని సార్లు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇది సెకండ్ వేవ్ లో పోల్చితే…
కరోనా కల్లోలం కారణంగా ప్యాండమిక్ లో జనం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అడిక్ట్ అయ్యారు. థియేటర్లు తెరచిన తరువాత కూడా పోలోమని సినిమాలకు వెళ్ళడం లేదు. రెండు, మూడు వారాలు ఆగితే ఎటూ బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన సినిమా ఓటీటీల్లోనూ వస్తుంది కదా అని ఉదాసీనత జనంలో ఏర్పడింది. అయితే పాపులర్ స్టార్స్ సినిమాలను థియేటర్లలోనే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మౌత్ టాక్ తో ఆకట్టుకున్న చిన్న సినిమాలనూ ఆదరిస్తున్నారు. కానీ, వస్తోన్న…
దేశంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతోంది. వరసగా ఇటీవల కాలంలో 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు నెలల కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,038 కేసులు నమోదు అయ్యాయి. వరసగా రెండు రోజులుగా 20 వేల…
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.…
కరోనా అంతానికి భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభం కానుంది. బుధవారం కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం…
దేశంలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది.ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను దాటింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,139 కేసులు నమోదు అయ్యాయి. 38 మంది కోవిడ్ బారినపడి మరణించారు. 16,482…
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో కూడా రోజూ 500 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య…