ఐసీఎమ్ఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) నిరాకరించిన సంగతి తెలిసిందే.. యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ను అమెరికాలో సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.. అత్యవసర వినియోగానికి అనుమతి కోరగా ఎఫ్డీఏ నిరాకరించింది. మరింత అదనపు సమాచారాన్ని కోరింది.. అయితే, కోవాగ్జిన్ కోసం మార్కెటింగ్ అనువర్తనానికి మద్దతుగా అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్…
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను…
భారత్ సొంత టెక్నాలజీతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్కు తయారు చేసింది. అయితే, అధికమొత్తంలో వ్యాక్సిన ఉత్పత్తి చేసేందుకు కోవాగ్జిన్ సంస్థ ఇండియాలోని మరికొన్ని కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని హెచ్.బీ.పీ.సీ.ఎల్ సంస్థ రాబోయో 8 నెలల కాలంలో 22 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్టు మహారాష్ట్ర ఫార్మా సంస్థ తెలిసింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి మహా సర్కార్ రూ.93 కోట్లు, కేంద్రం రూ.65 కోట్లు నిధులను…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కు కొత్త సమస్య వచ్చింది. తాజాగా ప్రకటించిన WHO అత్యవసర యూజ్ లిస్టింగ్ లో ఇంకా చోటు దక్కలేదు. అయితే WHO అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని యూఎస్, యూకే దేశాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి అమెరికా, యూకే లోకి అనుమతించబోమని ఆ దేశాలు అంటున్నాయి. దీంతో భారత్ బయోటెక్…
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా వ్యాక్సినేషన్పై పడిపోయారు.. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లతో పాటు.. రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలుచేస్తున్న సంగతి తెలిసిందే… ఇక, ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది.. 11,45, 540 కోవిషీల్డ్ డోసులకు గాను రూ.36,08,45,100 చెల్లించింది.. కోవిషీల్డ్ ఒక డోస్ ధర రూ 300 కాగా.. దానికి 5 శాతం ట్యాక్స్ కలుపుకుని రూ.315గా అవుతుంది.. ఇక,…
వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. తెలంగాణలోనూ అదే పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్.. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందిరికీ వ్యాక్సిన్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ ను తెప్పించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇక మే 1 నుంచి వ్యాక్సిన్ ను రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్…
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ను వేగవంతం చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇండియాలో తయారవుతుండగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేసేందుకు భారత్ బయోటెక్ సిద్దం అయింది. మే 1 వ తేదీ నుంచి దేశంలోని 14…
రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ నిన్న సీరం.. తన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరలు తగ్గించగా.. ఇప్పుడు.. భారత్ బయోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాలకు అందించే కొవాగ్జిన్ ధరలను తగ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, గతంలో ఒక్క డోసును రూ. 600గా నిర్ధారించిన భారత్ బయోటెక్.. ఇప్పుడు ఏకంగా ఒక్క డోసుపై రూ. 200కు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, కోవిషీల్డ్ టీకా ధరను సీరం…
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మొదట రెండు వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు.. అయితే, కోవాగ్జిన్ సమర్థతపై కీలక ప్రకటన చేసింది ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది.. కొత్త వేరియంట్లను కూడా లోకల్ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది.. భారత వైద్య పరిశోధన మండలి.. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు…