దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు పెరిగే కొలది కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆరునెలల తరువాత మరలా ఢిల్లీ, ముంబై లో కేసులు పెరుగుతుండటంతో దేశం అప్రమత్తం అయింది. శనివారం రోజున ఢిల్లీలో 38శాతం కేసులు పెరగ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి. ఢిల్లీలో శనివారం రోజున 249 కొత్త కేసులు నమోదవ్వగా, ముంబైలో 757 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముంబైలో నైట్ కర్ఫ్యూతో…
ఒమిక్రాన్ వేరియంట్తో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రిటన్లో 1,22,186 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తరువాతనే కరోనా వ్యాప్తి ఈ స్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. Read: ఇంతకంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మహీంద్రా ట్వీట్… డిసెంబర్…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు చమురుతో నడిచే వాహానాలను పక్కనపెట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహానాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో కొత్త కార్లకు క్రమంగా డిమాండ్ తగ్గుతుండగా, పాత కార్లకు అదే రేంజ్లో డిమాండ్ పెరుగుతున్నది. 2020-21 సంవత్సరంలో జరిగిన ఆర్థికపరమైన మార్పుల కారణంగా వినియోగదారులు పాతకార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. Read: టీడీపీలో ఇంఛార్జుల నియామకంపై ప్రకంపనలు..! మెగా సిటీల్లోనే…
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 7,189 కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కరోజులో 387 మంది కరోనా సోకి చనిపోయినట్లు తెలిపారు. వీరితో పాటు 7,286 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 77,032 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో పాటు దేశంలో 141.01 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు…
ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ దాడులు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒమిక్రాన్ దెబ్బకు దేశాలకు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ యూరప్, అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంమీద లక్షన్నర కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఇండియాలో నిర్వహించారు. అయినప్పటికీ కేసులు…
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్లో అడుగుపెట్టింది.. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే కాగా… తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒమిక్రాన్ వెలుగు చూసింది… తూర్పు గోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. దీంతో.. కోనసీమలో కలకలం మొదలైంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. బాధితురాలు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా…
ఇండియా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,650 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 374 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,72,626 కు చేరుకుంది. అలాగే రికవరీల సంఖ్య 3,42,15,977 కు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,79,133 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం…
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు సర్కార్ పేర్కొన్నది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో కొత్తగా 23…
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,98,568 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…