దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జ్వరం, జలుబు వంటి లక్షలు ప్రాధమికంగా కరోనా లక్షణాలుగా ఉండేవి. అయితే, జ్వరం, జలుబు ఉన్న వ్యక్తులందరికి కరోనా వస్తుందని అని గ్యారెంటీ లేదు. ఈ ప్రాధమిక లక్షణాలతో పాటుగా ఇప్పుడు మరికొన్ని లక్షణాలు కూడా వచ్చి చేరాయి. జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. అంతేకాదు, తలనొప్పి, నీరసం వంటి వాటితో బాధపడే వ్యక్తులకు టెస్టులు చేసినపుడు కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే గాలి నుంచి…
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా కోరలు చాస్తోంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇక బుధవారం రోజున నిర్వహించిన రాజస్నానం కార్యక్రమంలో లక్షల సంఖ్యలో సాధువులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఇలా రాజస్నానం చేసేందుకు హాజరైన నాగా సాధువుల్లో 30 మందికి కరోనా సోకింది. దీంతో కుంభమేళాలో అలజడి మొదలైంది. నిరంజని, జావాతో పాటుగా అనేక అఖాడాకు చెందిన సాధువులు కరోనా బారిన పడినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. సాధువులకు కరోనా టెస్టులు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విద్యార్థులకు, యువతకు ఎక్కువగా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్స్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా విజయవాడ పడమటలోని కోనేరు బసవయ్య చౌదరి స్కూల్ లో కరోనా కలకలం రేగింది. టీచర్ కు కరోనా పాజిటివ్ రావడంతో యాజమాన్యం మూడురోజులపాటు సెలవు ప్రకటించింది. పాఠశాలలో మొత్తం 1300 విద్యార్థులు, 40 మంది టీచర్లు ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన టీచర్…
చూస్తుండగానే కోవిడ్ 19 సెకండ్ వేవ్ అదుపు తప్పిపోవడం ఆందోళనకరంగా మారింది, రోజుకు రెండు లక్షల కేసులకు మించి నమోదవడం మొదటి దఫా పరిస్తితిని మించిపోయింది.కేసులు ఎక్కువగా వున్నా మరణాలు ఆ స్తాయిలో లేవని మొదట అనుకున్నారు గాని ఆ సంతోషం కూడా ఆవిరైపోయింది. మొదటి దఫాలో మరణాల రేటు 1.1 శాతం లోపే ఉండగా ఇప్పుడు 1.3 శాతం దాటిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. పైగా పెరుగుదల వేగం కూడా గతం కంటే చాలా ఎక్కువగా వుంది.గతంలో…
ఇండియాలో విజృంభణ దారుణంగా ఉంది. రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లిస్ట్ లో ఉన్నది. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. సెకండ్ వేవ్ లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో…
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్నది. మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది ఈ కుంభమేళాకు తరలివస్తుంటారు. కరోనా సమయంలో జరుగుతున్న కుంభమేళా కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కుంభమేళాలో వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది కుంభమేళాకు వచ్చిన భక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం కుంభమేళాపై కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లి…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఐదువేలు దాటిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇండియా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇండియాలో మరో వ్యాక్సిన్ కూడా రెడీ అయ్యింది. అయితే, ఇది అలోపతి కాదు, హోమియోపతి వ్యాక్సిన్. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియాలో హోమియోపతి వ్యాక్సిన్ తయారు చేసినట్టు లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్…
ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న ఆరువారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను…