ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్నది. మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది ఈ కుంభమేళాకు తరలివస్తుంటారు. కరోనా సమయంలో జరుగుతున్న కుంభమేళా కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కుంభమేళాలో వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది కుంభమేళాకు వచ్చిన భక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం కుంభమేళాపై కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లి వచ్చే కర్ణాటకకు చెందిన భక్తులు తిరిగి వచ్చిన తరువాత తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పుణ్యస్నానాలు చేసిన భక్తులు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, కరోనా నెగెటివ్ వస్తేనే మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలని కర్ణాటక వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది.