దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13…
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఒక్కరోజులోనే లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని.. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ తిరుగుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, బయటికెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. Read Also: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి…
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్లో ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. Read Also: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ గుడ్న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు ఆరు నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడించింది. Read Also:…
ఒకప్పుడు కరోనా వైరస్.. తర్వాత డెల్టా… ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్. చిన్నవైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత తక్కువగానే ఉంది.…
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే థర్డ్వేవ్ వచ్చినట్లు క్లియర్గా కనిపిస్తోంది. వారం రోజుల తేడాలో దాదాపు 44 వేల కరోనా కేసులు పెరిగాయి. వారం క్రితం 13వేలు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం 58వేల మార్కుకు చేరుకున్నాయి. Read Also: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు గత వారం రోజులుగా నమోదైన కేసుల…
ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సౌతాఫ్రికాలో బయటపడిని ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. ఒమిక్రాన్ ధాటికి ప్రపంచ ఆరోగ్యం పడకేసింది. యూకే, ఫ్రాన్స్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్లో రెండు లక్షలకు పైగా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఇక యూఎస్లో రోజువారి కేసులు 5 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వలనే కేసులు…
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో కొత్త కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదలతో ఆసుపత్రులపై క్రమంగా ఒత్తిడి పెరగడం ప్రారంభం అయింది. వెంటనే కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. Read: ఢిల్లీ,…
ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ దాడులు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒమిక్రాన్ దెబ్బకు దేశాలకు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ యూరప్, అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంమీద లక్షన్నర కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఇండియాలో నిర్వహించారు. అయినప్పటికీ కేసులు…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్ల వేగంతో ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేయడం ఖాయమని చెబుతున్నారు. ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను సౌతాఫ్రికాలో గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్కు హెచ్ఐవీ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు…