దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉంది.
Read Also: 3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్ వార్నింగ్
ఇప్పటివరకు భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 4,87,202కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 158,88,47,554 వ్యాక్సిన్ డోసులను అధికారులు పంపిణీ చేశారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 0.79 శాతం పెరిగాయి.
India reports 2,82,970 COVID cases (44,889 more than yesterday), 441 deaths, and 1,88,157 recoveries in the last 24 hours.
— ANI (@ANI) January 19, 2022
Active case: 18,31,000
Daily positivity rate: 15.13%
8,961 total Omicron cases detected so far; an increase of 0.79% since yesterday pic.twitter.com/Fz8ZfjplTF