కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా చైనాలోని పలు నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో తాజాగా అధికారులు కఠినమైన లాక్డౌన్ విధించారు. దీంతో షెన్జెన్ నగరంలోని 90 లక్షల మంది ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్డాంగ్ ప్రావిన్స్లోని యుచెంగ్లో కూడా లాక్డౌన్ ఆంక్షలు జారీ చేశారు. రెండు రోజుల కిందట జిలిన్…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య నగరమైన చాంగ్చున్లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్చున్లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది…
ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ మహమ్మారి శాంతించింది. ప్రస్తుతం రోజువారీ 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాలను కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత గత రెండు రోజులుగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్…
రెండేళ్ళకు పైగా ప్రపంచాన్ని వణికించింది చిన్న వైరస్. గతంలో ఎన్నడూ లేని విధంగా మృత్యుఘంటికలు మోగించిన కోవిడ్ కథ ముగిసిందా. ఈ వైరస్ అప్పుడే అంతం కాలేదని స్పష్టం చేసింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా తగ్గింది కదా అని ఏమాత్రం లైట్ తీస్కోవద్దని హెచ్చరించింది. కరోనా శాశ్వతంగా ఇకపై మనతోనే ఉండనుందా? ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా కథ ముగిసిందని.. మహమ్మారి ఎండెమిక్గా మారినట్టు తెలిపింది. అయితే…
మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదైంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్లు విధించాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 34,113 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కారోనా మహమ్మారిలో సార్స్కోవ్ 2, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ప్రపంచంపై దాడి చేశాయి. సార్స్కోవ్ 2, డెల్టా వేరియంట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపగా, ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నది. అయితే, కొత్త వేరియంట్లు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తాయో ముందుగానే గమనిస్తే వాటిని ఎదుర్కొనడం తేలిక అవుతుంది. దీంతో శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ల పుట్టుకపై దృష్టి…
కరోనా నేపథ్యంలో గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్లపై…
సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల…
కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా…
విజయవాడ నగరంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలపై ఈ ఏడాది కరోనా ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది మంది హాజరయ్యే గుణదల మేరీ మాత ఉత్సవాలను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సందర్భంగా లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం కష్టసాధ్యమని, భక్తులు ఇబ్బందికి గురికాకూడదని నిర్వాహకులు యోచిస్తున్నారు. అందుకే ఉత్సవాలను రద్దు చేయాలని…