విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమా ఈ రోజు (ఫిబ్రవరి 11న) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే కొందరు సినిమాపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత భావాలను చిత్ర యూనిట్ ఖండించింది. ”మా ‘ఎఫ్.ఐ.ఆర్.’ ఏ మతస్థులను కించపరిచేట్లు తీయలేదు. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. కానీ, ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా వుందని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగింది. కానీ సినిమాను చూసిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం…
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘భీమ్లానాయక్’ కూడా ఒకటి. ఈ మూవీపై ఉన్న హైప్కి తగినట్లే సినిమాలో పాటలకు కూడా చక్కటి రెస్పాన్స్ వస్తోంది. మేకర్స్ ఈ నెల 25న సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ మూవీ మ్యూజిక్ విషయంలో కాపీరైట్ వివాదం చెలరేగినట్లు వినిపిస్తోంది. ఈ సినిమా మాతృక అయిన…
భారత క్రికెట్లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది. అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ…
అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు రాశారు. అంతేకాదు, మధ్యప్రదేశ్, మేఘాలయ, బీహార్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కూడా సవరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని…
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా విరాట్ కోహ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు. కేప్టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ నాటౌట్కు సంబంధించి డీఆర్ఎస్ విషయంలో విరాట్ కోహ్లీ స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రసార కర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ కోహ్లీపై విమర్శలు చేశాడు. కోహ్లీకి భారీ జరిమానా విధించాలని… అంతేకాకుండా కోహ్లీ నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఆటలో క్రికెటర్లు…
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సిద్ధార్ద్ చేసిన ట్విట్ను డిలీట్ చేయాలని.. అతడిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. పంజాబ్లో ప్రధాని మోదీ భద్రత అంశంలో బీజేపీని విమర్శిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్కు సైనా నెహ్వాల్ రిప్లై ఇచ్చింది. ప్రధాని భద్రతకు విఘాతం కలిగిస్తే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదంటూ పేర్కొంది. దీంతో సిద్ధార్థ్…
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను విమర్శిస్తూ ఆమె మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు ఎలాంటి హక్కులు రాలేదన్నారు. అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రాం వల్ల సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించారు. Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు…
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎందుకు…
మహారాష్ట్రలోని శివసేన సీనియర్ నేత, మంత్రి గులాబ్రావు పాటిల్ ఆదివారం నాడు చేసిన వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన నియోజకవర్గంలోని ధరంగావ్లో రోడ్లు నటి హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సందర్భంగా నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రోడ్లను నటీనటుల బుగ్గలతో పోల్చే సంప్రదాయం ఆర్జేడీ ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు. గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఈ సంప్రదాయానికి తెరతీయగా… ఇప్పుడు శివసేన…
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఐటం సాంగ్స్ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. దేవిశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీప్రసాద్ హిందూవులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆయన బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు.…