IPL 2022: వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్పై క్రికెట్ అభిమానుల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మ్యాచ్లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఇదే మ్యాచ్లో అంతకంటే ముందు ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించాడు. 2019 తర్వాత అతడు ఓ మ్యాచ్ లో మూడు వికెట్ల తీయడం ఇదే తొలిసారి. మరోవైపు ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై-కోల్కతా జట్ల మధ్య జరగ్గా.. కోల్కతా బౌలర్ ఉమేష్ యాదవ్ రెండు వికెట్లతో చెలరేగాడు. తొలి ఓవర్లోనే గత ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
ఈ నేపథ్యంలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్… ఇలా ముగ్గురి ప్రదర్శనను ఉద్దేశిస్తూ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చేసి ట్వీట్ దుమారం రేపింది. ’ప్రస్తుతం యాదవుల ఐపీఎల్ జరుగుతుంది‘ అని అర్థం వచ్చేలా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్కు ప్రాంతం, కులాన్ని అంటగట్టడం మంచిది కాదని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!