నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కరోనా నివారణ చర్యల్లో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడంపై ట్విట్టర్లో స్పందించిన రాహుల్.. ఆ పోస్టర్ల కాపీలను షేర్ చేస్తూ. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ కామెంట్ పెట్టారు.. ఇక, మోడీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో కాంగ్రెస్ ఎంపి రాజీవ్ సాతావ్ ఇవాళ మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్…
గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం ప్రారంభం అయిందని..లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారు..విచారణ పేరిట అడ్డుకుం టున్నారని…
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా సమీక్ష ప్రారంభించింది. తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ ఆద్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ వర్చువల్ సమావేశం మొక్కుబడిగా తప్ప లోతుగా పరిశీలన జరిపిందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఎన్నికలో తమ పార్టీకి వచ్చిన పలితాలు చాలా నిరుత్సాహకరంగా వున్నాయని సోనియాగాంధీ వ్యాఖ్యానించడం మినహా మరే విధమైన ఆత్మ విమర్శ కనిపించలేదు. కేరళలో అస్సాంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకున్నది. పశ్చిమ బెంగాల్లో వామపక్షంతో…
మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, రాజయ్యగారి ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన గతాన్ని సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసిన ముత్యం రెడ్డి ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేసుకున్నారు.…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. మొదట కరోనా కట్టడిపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. మంత్రి ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు, వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంపై స్పందించిన వీహెచ్.. మంత్రి ఈటల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.. కానీ, ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ ఆగడం లేదు.. ఈ పరిస్థితిలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు.. ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయన.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్రశంసించారు.. అయితే, కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. బుధవారం రోజు బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ కామెంట్లు చేయగా.. సీఎం వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జానారెడ్డి.. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయన.. అధికార పార్టీ తీరు తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు…
నాగార్జున సాగర్ లోని జానారెడ్డి ఇంట్లో ఇంఛార్జి ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సభ, సాగర్ లో తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి… రేవంత్ హాజరయ్యారు. పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని, సాగర్ నియోజకవర్గ పరిధి పొరుగున ఉండాలని అన్నారు. టీఆర్ఎస్…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.. సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన.. జానారెడ్డి పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్న ఆయన.. గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గిరిజనులకు 10 శాతం…