వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి.. కానీ, ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు కాకరేపుతున్నాయి.. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో స్నేహం నెరుపుతాయని కాంగ్రెస్, ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన ఆయన.. పేదలకు డబ్బు ఆశ చూపి మదర్సాలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు.. ముస్లిం దేశాల నుంచి నేరుగా మతం మారిన పేదల ఖాతాల్లో నగదు జమ…
పీసీసీలో పంచాయితీలు.. మహిళా కాంగ్రెస్లో సిగపట్లు. కాంగ్రెస్ కల్చర్లో ఇది కామన్. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ చీఫ్ పోస్ట్కంటే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై ఎక్కువ రచ్చ అవుతోంది. కమిటీ కూర్పు కొలిక్కివస్తున్నా.. ఆపేవాళ్లు తెరవెనక చురుగ్గానే పావులు కదుపుతున్నారట. ధరలు పెరిగినా.. మహిళా కాంగ్రెస్ సైలెంట్! తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం జటిలంగా మారినట్టే.. మహిళా కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా కయ్యాలు ఓ రేంజ్లో సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు…
కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు.…
ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్ ఫ్లాట్ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్వార్ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్ జిలానీ? గ్రూప్వార్ కారణంగా టీఆర్ఎస్లో టికెట్ రాలేదా? రమేష్ రాథోడ్. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో…
పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. కాంగ్రెస్లో ప్రకంపనలేనా? ఆయనకు పదవి ఇస్తే పార్టీలో ఉండలేమన్న బెదిరింపులు దేనికి సంకేతం? ఇంతకీ అవి బెదిరింపులా.. నిజంగా డిసైడ్ అయ్యారా? పీసీసీ పంచాయితీ కంటే.. ప్రకటన తర్వాత జరిగే లొల్లే ఎక్కువగా ఉంటుందా? తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? లెట్స్ కాంగ్రెస్కు గుడ్బై చెబుతామని కొందరు హెచ్చరిక? తెలంగాణ పీసీసీని కొలిక్కి తెచ్చే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్ఠానం. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది ఇప్పటికే ఖారారైనట్లు చెబుతున్నారు. ఎంపీ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అంతర్గత విభేధాలు భగ్గుమన్నాయి. అమరిందర్ సింగ్ ను అధికారపార్టీకి చెందిన కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సునీల్ ఖాజర్ ముఖ్యమంత్రిని ప్రముఖంగా విమర్శంచే వారిలో ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అమరిందర్ సింగ్పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్థూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. Read: నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో…
ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తిష్టవేసి పావులు కదుపుతున్నారు.. ఈ సమయంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు ముద్దసాని కశ్యప్ రెడ్డి.. ఇవాళ గులాబీ పార్టీ గూటికి చేరారు.. ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయనకు పేరుంది… వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కశ్యప్ రెడ్డి.. కాసేపటి క్రితం.. మంత్రులు హరీష్ రావు, కొప్పుల…
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మరో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చ లేదని… ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని హనుమంతరావు పేర్కొన్నారు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీని పంపించారని… ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా…
మహారాష్ట్రలో మహా అఘాడి సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీనేత నానా పటోలె పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని పటోలె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పోరాటాలను తమ పార్టీ సొంతంగా చేస్తుందని, ఒంటరిగా…
ఆయన ఫోన్ మోగిందంటే కాంగ్రెస్ నాయకులకు హడల్. గడిచిన కొన్ని రోజులుగా ఆయన వేట మామూలుగా లేదట. డైలీ ఏదో ఒక బాంబు పేల్చుతూనే ఉన్నారు. దీంతో మహాప్రభో.. ఏంటీ వాయింపు? అని తల పట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా లీడర్? ఎదురుపడితే బ్యాండ్ బాజానే! వి. హన్మంతరావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఫోన్ చేస్తే భయపడుతూనే కాల్ రిసీవ్ చేసుకుంటారు నాయకులు. ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయకపోతే.. రేపటి రోజున ఆయనకు…