కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న గులాంనబీ ఆజాద్ ఇవాళ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆజాద్ తన కొత్త రాజకీయ పార్టీ గురించి అడిగినప్పుడు, "నేను సోమవారం విలేకరుల సమావేశం నిర్వహిస్తాను" అని చెప్పారు.
రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్కుమార్లు కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో నేతలు ఆమెను కలిశారు. జాతీయ రాజకీయాలు, విపక్ష పార్టీల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.