Bhatti Vikramarka : బీజేపీ, టీఆర్ఎస్ లపై సీఎల్పీ నేత భట్టి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ తెలంగాణలో మతపరమైన ఉద్వేషాలు రెచ్చగొడుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది బీజేపీ అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా మాటలకే పరిమితమైందని, రైతుల పండించిన పంట కొనలేని దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు.
Also Read
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరిపైన ఐదు లక్షల అప్పు మిగిలిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!