Sonia Gandhi: సోనియాగాంధీతో లాలూ, నితీష్ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్కుమార్లు కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో నేతలు ఆమెను కలిశారు. జాతీయ రాజకీయాలు, విపక్ష పార్టీల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల తర్వాత మరోసారి సమావేశం అవుదామని సోనియా చెప్పారని నేతలు వెల్లడించారు. ప్రతిపక్షాలలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ప్రతిపక్షాల ఐక్యతకు మరింత చొరవ చూపాలని సోనియా గాంధీని కోరామన్నారు. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నితీష్ కుమార్ సోనియా గాంధీని కలవడం గమనార్హం. 2015లో బీహార్ ఎన్నికల ముందు జరిగిన ఇఫ్తార్ విందులో సోనియాగాంధీని కలిశారు నితీష్.
జాతీయ స్థాయిలో బీజేపీ కూటమికి చెక్ పెట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్. బీహర్ లో బీజేపీని వదిలి ఆర్జేడీతో జట్టుకట్టి అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో పర్యటించారు నితీష్ కుమార్. ఈ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వామపక్ష నేతలను కలిశారు. వీరందరితో 2024 సాధారణ ఎన్నికలపై చర్చించారు. మరోవైపు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీజేపీ టార్గెట్గా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడి ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న లాలూకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే వారంలో కిడ్నీ మార్పిడి కోసం ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ బీహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
Nitish Kumar: దేశంలో థర్డ్ ఫ్రంట్ లేదు.. కాంగ్రెస్తో కలిసి ఒకటే కూటమి..
ఇవాళ హర్యానాలోని ఫతేహాబాద్లో జరిగిన దేవిలాల్ జయంతి వేడుకల్లో మాట్లాడిన నితీష్ కుమార్.. దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ “ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్” 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేసేందుకు పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని, హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే తన కోరిక అని.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని నితీష్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!