తెలంగాణలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై, ఆయన స్పీకర్ కు వినతిపత్రం అందజేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను దానం నాగేందర్ ఘాటుగా ఖండిస్తూ, ఆ పిటిషన్ను కొట్టి వేయాలని స్పీకర్ను కోరారు. అఫిడవిట్లో దానం నాగేందర్ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు సమాచారమూ అధికారికంగా తనకు అందలేదని స్పష్టం చేశారు.…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో సహా ఆరుగురు మరణించినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
నియోజకవర్గాలు అప్పగించారు. బాధ్యతలు పంచేశారు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా…. ఇక పూర్తి భారం మీదేనని క్లారీటీ ఇచ్చేశారు. ఇదే కొందరు తెలంగాణ మంత్రుల్ని టెన్షన్ పెడుతోందట. ఈ పరీక్ష ఎలా నెగ్గాలంటూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇంతకీ ఏంటా పరీక్ష? ఇన్ఛార్జ్ మినిస్టర్స్కు కంగారు ఎందుకు? మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ అధికార పక్షానికి సవాల్గా మారుతున్నాయి. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ని గెలుచుకోవాలని ఇప్పటికే నేతలకు దిశా నిర్దేశం చేసింది కాంగ్రెస్ హై కమాండ్.…
శశిథరూర్.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుతం తిరువనంతపురం లోక్సభ ఎంపీగా ఉన్నారు. అయితే చాలా కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. బీజేపీ నేతలతో ఎక్కువగా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ప్రధాని మోడీని పదే పదే మెచ్చుకుంటున్నారు.
ప్రొటోకాల్ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రగడగా మారింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గ్రాండ్గా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయితీ ఎప్పటికీ ఒడవని ముచ్చటేనా? మున్సిపల్ ఎన్నికల వేళ ఇద్దరు నేతల మధ్య వార్డుల వాటా వ్యవహారం మొదటికే మోసం తెస్తుందా? తగ్గేదేలే అంటున్న రెండు వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఎక్కడ జరుగుతోందా పోట్ల గిత్తల పోరు? ఆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలనుకుంటోంది? మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల్ నియోజకవర్గ రాజకీయం రసత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు అంశం వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని ఆరోపించారు. ఓటర్లను ఎంపిక చేసి, ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల జాబితాను ఎస్ఐఆర్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నది పరిపాలనాపరమైన కసరత్తు కాదని, ఒక వ్యక్తి-ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసి, ప్రజల బదులుగా బీజేపీనే…
Himanta Biswa Sarma: కాంగ్రెస్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య విభేదాలు ఉన్నాయని అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. దావోస్ పర్యటనలో గాంధీ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. గతంలో వీరిద్దరి మధ్య అంతర్గత పోరాటానికి తాను బాధితుడిని అయ్యానని చెప్పారు. ప్రస్తుతం, అస్సాం ఎన్నికల కమిటీని ప్రియాంకా గాంధీ సారధ్యం వహిస్తున్నారు. దీనిపై హిమంత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేరళ విషయాల్లో ప్రియాంకా జోక్యాన్ని రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని…
Mallikarjun Kharge: రాజకీయ దుమారానికి కారణమయ్యే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఓట్ల కోసమే తనను తాను ‘‘చాయ్వాలా’’గా చెప్పుకున్నారని ఆరోపించారు. ‘‘ఓట్ల కోసం నేను టీ అమ్మేవాడిని అని చెబుతుంటారు. ఆయన ఎప్పుడైనా టీ చేశారా.? ఎప్పుడైనా కెటిల్ పట్టుకుని ప్రజలకు టీ అందించారా.? ఇదంతా ఒక నాటకం. పేదలను అణచివేయడం ఒక అలవాటు’’ అని ఖర్గే అన్నారు. యూపీఏ హయాంలో ఉన్న…