Rahul Gandhi: ఎక్కడ SIR ఉంటే, అక్కడ ఓట్ల దొంగతనం జరుగుతుంది..
- SIR ఎక్కడ ఉంటే అక్కడ ఓట్ల చోరీ జరుగుతుంది..
- మరోసారి ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని ఆరోపించారు. ఓటర్లను ఎంపిక చేసి, ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల జాబితాను ఎస్ఐఆర్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నది పరిపాలనాపరమైన కసరత్తు కాదని, ఒక వ్యక్తి-ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసి, ప్రజల బదులుగా బీజేపీనే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతోందని, SIR ఉన్న చోటల్లా ఓటు దొంగతనం జరుగుతోందని, గుజరాత్లో కూడా ఇదే విధంగా ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఎక్స్లో ఆరోపించారు. కాంగ్రెస్కు మద్దతు ఇచ్యచే నిర్దిష్ట వర్గాలు, కులాలు, పోలింగ్ బూత్ల నుంచి ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకే పేరుతో వేల సంఖ్యలో అభ్యంతరాలు దాఖలయ్యాయని, బీజేపీకి ఓటమి భయం ఉన్న చోట్ల ఓటర్లు సిస్టమ్ నుంచి మాయమవుతున్నారని అన్నారు.
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
Read Also: Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
అలంద్, రాజురాలలో గతంలో ఇదే విధంగా జరిగిందని, ఎస్ఐఆర్ అమలు చేయబడిని గుజరాత్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే బ్లూ ప్రింట్ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఇకపై ప్రజాస్వామ్య రక్షకుడు కాదని, ఓట్ల దొంగతనం కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ కాంగ్రెస్ కూడా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంరాలకు చివరి తేదీ జనవరి 18గా పెట్టారని, జనవరి 15 వరకు తక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని , కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఫారమ్-7 ద్వారా లక్షల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని ఆరోపించింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం 12 లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పింది. ఒకే వ్యక్తి పేరుతో డజన్ల కొద్దీ అభ్యంతరాలు వచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!