కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి..…
తెలంగాణ మంత్రులు కొందరి మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా?.. ఆ లక్ష్యాన్ని ఛేదించేదాన్ని బట్టే భవిష్యత్ అవకాశాలు, ఇతర వ్యవహారాలు ఆధారపడి ఉంటాయా?.. ఏంటా కొత్త టాస్క్?.. దాని గురించి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి?. తెలంగాణ మంత్రులకు కొత్త టాస్క్ వచ్చి పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. పార్టీ సింబల్తో సంబంధం లేకున్నా… ఆ…
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను “100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలి” అని రేవంత్…
సంగారెడ్డి జిల్లా పటాంచెరు రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన నిర్ణయంపై బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తాను చేసిన ఒక “తప్పటడుగు” అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి మారడం వల్ల తన నియోజకవర్గానికి లేదా నియోజకవర్గ ప్రజలకు కనీసం “వెంట్రుక…
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఏకంగా 20మంది ఐపీఎస్ లను బదిలీ చేసి పోస్టింగ్స్ ఇచ్చింది. డా. గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్గా నియామకం అయ్యారు. అదనంగా IG – స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్చార్జ్ గా నియమితులయ్యారు. అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి, విజిలెన్స్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో రూ.1284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఎం.వి.ఎస్ డిగ్రీ,పి.జి కళాశాలలో రూ.200 కోట్లతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. రూ.20.50 కోట్లతో ఎం. వి.ఎస్.డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు శంకు స్థాపన చేశారు. Also…
తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ ఆయన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని…
ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధీమా వ్యక్తం చేశారు. గురువారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలో మాయావతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రగడ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం కర్ణాటకకు వచ్చారు.