తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు.
Dk Sivakumar: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలోనూ, అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. గెలిచే అభ్యర్థులను జంప్ చేయడం కంటే సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను కలిసి ఉంచడంలో ఆయన నిపుణుడు.
తెలంగాణ ఎగ్జిట్పోల్స్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్పోల్స్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ 63–73 స్థానాలతో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ శుక్రవారం అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రంలోని కరువు స్థితి గతులను గవర్నర్కు విన్నవించడం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు.
Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.
Madhya Pradesh: సింగ్ ఈస్ కింగ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివ"రాజ్"సింగ్ పాలనే కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ వంటివి బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం బీజేపీ కన్నా స్వల్పంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను సాధిస్తుందంటూ అంచనా వేస్తున్నాయి.
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలవుతారని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి.
రాజస్థాన్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయన తన వాదనను బలపరిచేందుకు మూడు కారణాలను ప్రస్తావించారు. కేవలం రాజస్థాన్లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో దేనిలోనూ బీజేపీ గెలవబోదని అన్నారు.