Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress rejects Uddhav Sena’s 23-seat demand in Maharashtra: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలన్న మిత్రపక్షం శివసేన (యూబీటీ) డిమాండ్ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ భాగస్వాములైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగింది.
శివసేన రెండు వర్గాలుగా చీలిపోయి, మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను ఇవ్వాలని కోరింది. అయితే దాని మెజారిటీ సభ్యులు ఏకనాథ్ షిండే వైపు మొగ్గు చూపారు. పార్టీ విభజన కారణంగా తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గం గణనీయమైన సవాలును ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ అన్నారు. శివసేన, శరద్పవార్ల ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో పాత పార్టీ ఒక్కటే స్థిరమైన ఓట్షేర్తో కనిపిస్తోందని సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. “ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ అధికంగా ఉంది” అని ఆయన అన్నారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Read Also: Formula E-Race: హైదరాబాద్ లో ఈ-రేసింగ్ చూడలేమా?.. 2024 లో రద్దేనా..?
సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని సంజయ్ నిరుపమ్ అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారు? సంక్షోభం తెచ్చిపెట్టిన శివసేన నేతలు వెళ్లిపోయారు. శివసేనకు అభ్యర్థుల కొరతగా ఉందని పేర్కొన్నారు. గత వారం, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, పార్టీ నాయకులు ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య ఠాక్రేలతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్తో ఇటీవల చర్చలు జరిపినట్లు చెప్పారు. ఈ ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. గ్రెస్, ఎన్సీపీ పోటీ చేసే సీట్ల సంఖ్యపై రౌత్ ఏమీ చెప్పకపోవడం గమనార్హం.
2019లో అవిభక్త శివసేన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగమైంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 2022లో ఏక్నాథ్ షిండే, 40 మంది ఇతర ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఇది పార్టీలో చీలికకు దారితీసింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వం కూలిపోయింది.ఆ తర్వాత ఏకనాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!