Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన 23 సీట్ల డిమాండ్.. తిరస్కరించిన కాంగ్రెస్!
Congress rejects Uddhav Sena’s 23-seat demand in Maharashtra: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలన్న మిత్రపక్షం శివసేన (యూబీటీ) డిమాండ్ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ భాగస్వాములైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగింది.
శివసేన రెండు వర్గాలుగా చీలిపోయి, మహారాష్ట్రలోని 48 సీట్లలో 23 సీట్లను ఇవ్వాలని కోరింది. అయితే దాని మెజారిటీ సభ్యులు ఏకనాథ్ షిండే వైపు మొగ్గు చూపారు. పార్టీ విభజన కారణంగా తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గం గణనీయమైన సవాలును ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ అన్నారు. శివసేన, శరద్పవార్ల ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో పాత పార్టీ ఒక్కటే స్థిరమైన ఓట్షేర్తో కనిపిస్తోందని సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. “ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ అధికంగా ఉంది” అని ఆయన అన్నారు.
Also Read
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
Read Also: Formula E-Race: హైదరాబాద్ లో ఈ-రేసింగ్ చూడలేమా?.. 2024 లో రద్దేనా..?
సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని సంజయ్ నిరుపమ్ అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారు? సంక్షోభం తెచ్చిపెట్టిన శివసేన నేతలు వెళ్లిపోయారు. శివసేనకు అభ్యర్థుల కొరతగా ఉందని పేర్కొన్నారు. గత వారం, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, పార్టీ నాయకులు ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య ఠాక్రేలతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్తో ఇటీవల చర్చలు జరిపినట్లు చెప్పారు. ఈ ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. గ్రెస్, ఎన్సీపీ పోటీ చేసే సీట్ల సంఖ్యపై రౌత్ ఏమీ చెప్పకపోవడం గమనార్హం.
2019లో అవిభక్త శివసేన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగమైంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 2022లో ఏక్నాథ్ షిండే, 40 మంది ఇతర ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఇది పార్టీలో చీలికకు దారితీసింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వం కూలిపోయింది.ఆ తర్వాత ఏకనాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!