Bharat Nyay Yatra: మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi to lead Bharat Nyay Yatra from 2024 January 14: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్ పాదయాత్ర చేయబోతున్నారని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14వ నుంచి మార్చి 20 వరకు 14 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్లో మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. ముంబై వరకు 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది.
బస్సు, కాలి నడక ద్వారా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో.. రాహుల్ ఈ యాత్ర చేయబోతున్నారని చెప్పారు. ఈ యాత్రలో యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్ ముఖాముఖి అవుతారని వేణుగోపాల్ వెల్లడించారు. ఈ యాత్ర రూట్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Also Read
- Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
మణిపుర్ నుంచి మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా చివరకు మహారాష్ట్రకు చేరుతుంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ గాంధీ యాత్ర చేస్తారు. గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా.. ఈసారి బస్సు యాత్ర ఎక్కువగా ఉంటుందట. ప్రతి రాష్ట్రంలో నేతలు ఈ యాత్రలో పాల్గొంటారట.
Also Read: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్.. భారత జట్టులో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది!
దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబరు 7న రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు. దాదాపు ఐదు నెలల పాటు 4, 500 కిమీల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. కశ్మీర్లోని లాల్చౌక్లో ముగిసింది. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్.. ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు చేయనున్నారు.
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!