Konda Surekha : ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి ప్రజా పాలన సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, గత ప్రభుత్వంలో జనం సమస్యలు చెప్పుకునే అవకాశం లేదన్నారు కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి సందేశం ప్రజలకు వినిపించిన తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని, అధికారులు తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, IAS, IPS అధికారులకు పనితనాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయని సీఎం చెప్పారు.. బాగా పని చేయండన్నారు. మేం పాలకులం కాదు సేవకులమని ఆమె వ్యాఖ్యానించారు. ఇల్లు అలకగానే పండగ కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన..ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు కొండా సురేఖ.
Also Read : Jagapathi Babu: ఖాన్సార్ లో కొత్త నిబంధన.. రాజమన్నార్ హుకుమ్
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
మాది కమాండ్ గవర్నమెంట్ కాదు…ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఆమె అన్నారు. ప్రోటోకాల్ పాటిస్తాం… ప్రజాపాలన ఫ్లెక్సీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలే ఉంటాయి. ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంటే అందరి ఫోటోలు ఫ్లెక్సీలో ఉండవని, గత ప్రభుత్వంలో డబుల్ రూమ్ ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. రైతు బంధు కూడా దుర్వినియోగం అయ్యింది..అందుకే సీఎం పెండింగ్ లో పెట్టారన్నారు. కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వంలో ఉండవు..మాకు అవసరం లేదన్నారు కొండా సురేఖ. అసెంబ్లీలో మీకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చామని, మేం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదు..అప్పుడే మాపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ శ్వేత పత్రం నిజం… బీఆర్ఎస్ స్వేద పత్రం అబద్దమన్నారు. మేం రాష్టంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని తెలియజేశాం..వాళ్లేమో అన్ని అబద్ధాలు చెప్పారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని BRS వాళ్ళు పగటి కలలు కంటున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని, అది జరగని పని ఇంకో 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామన్నారు.
Also Read : Success Story : ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి.. డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న యువరైతు..
తాజావార్తలు
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
-
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
-
Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
-
MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
-
Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!