BJP-Congress: 2024 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. దాదాపుగా మూడు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మరో విజయం సాధించింది. రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై.. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు. 35వేలకు పైగా మెజార్టీతో కోరుకంటి చందర్ పై ఘన విజయం సాధించారు.
Coal belt: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా దూసుకుపోతోంది. 119 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 60ని దాటిన కాంగ్రెస్, స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇదిలా ఉంటే సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కోల్బెల్ట్ నియోజకవర్గాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ గెలుపు ధీమాపై సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముందు నుండి చెప్తున్నా.. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వీహెచ్ అన్నారు. ఇది ప్రజల విజయం.. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలు చూసి కాంగ్రెస్ కు ఓటేసారన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని.. అది కూడా బాగా కలిసొచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని వీహెచ్ పేర్కొన్నారు.
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్కి ఎదురులేకుండా పోయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వచ్చింది. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు 18వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.
Jare Adinaryana wins Aswaraopeta Assembly Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వరావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 28 వేల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక్కడ ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మెచ్చా నాగేశ్వరరావు మీద గెలుపొందారు. మెచ్చా నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో…
Chennur: రాష్ట్రంలో ఎంతో ఆసక్తి రేపిన చెన్నూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వివేక్ వెంటకస్వామి భారీ ఆధిక్యతను కనబరుస్తున్నారు. కనుచూపు మేరలో కూడా బాల్క సుమన్ కనిపించడం లేదు.
Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఆ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ ఇప్పటికే ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 116 స్థానాలను దాటింది. అక్కడ 150కి పైగా స్థానాల్లో బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆధిక్యత కనబరుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.