లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే కొన్ని పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు బయటకు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో, ఆరుగురు అభ్యర్థులు ఆల్ టైమ్ రికార్డు కంటే అత్యధిక తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్ చివరి దశ వరకు గెలుపు లేదా ఓటమిని అంచనా వేయడం కష్టంగా ఉన్న అనేక స్థానాలు ఉన్నాయి.
AAP: లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్లు కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు.
2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విజయం సాధించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వినూత్నంగా.. నానా పటోలేను లడ్డూలతో తూకం వేశారు కార్యకర్తలు. రాష్ట్రంలో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరును సంబరాలు చేసుకుంటున్నారు. కాంటాకు బంతిపూలతో చక్కగా అలంకరించి.. అందులో ఒక పక్కకు నానా పటోల్ ను కూర్చోబెట్టారు. మరో పక్కకు లడ్డూలను పెట్టి తూకం వేశారు. ఇందుకోసం మొత్తం 96 కిలోల లడ్డూలను వినియోగించారు.
కేంద్రమంత్రి రేసులో ఉన్నారా అని ప్రశ్నపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రధానమంత్రి ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తాని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ రేసులో ఉండను.. ఎవరికీ ఎం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వచ్చాయన్న వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్.. రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్కి చావు తప్పి…
Criminal Cases On MP: మంగళవారం నాడు వెలుబడిన ఎన్నికల ఫలితాలలో కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్సభ సభ్యులలో 280 మంది మొదటిసారి లోకసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక 543 మందిలో ఏకంగా 251 మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికైన వారిలో 46 శాతంగా ఉంది. ఇందులో 27 మంది దోషులుగా నిర్ధారించబడ్డారని సమాచారం. లోక్ సభకు ఎన్నికైన అత్యధిక సంఖ్యలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల వివరాలు చూస్తే.. Annamalai: కమలం…
రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలిక వాయిదా పడింది. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసినందున తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం రేపు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్…
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. BJP సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకపక్షంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం 542 (మొత్తం 543 సీట్లు) లోక్సభ స్థానాలకు ఓట్లను లెక్కించింది. వీటిలో ఎన్డీఏ (NDA) 293, ఇండియా అలయన్స్ 234, తరులకు 16 సీట్లు వచ్చాయి.
Congress: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. బలపరిచిన టీడీపీ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సత్తా చాటింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం సీట్లలో భారీగా కోత పడింది. 2014, 2019ల్లో మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది.
రాష్ట్రంలో బీజేపీ నాయకులను గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉండాలని మమ్మల్ని గెలిపించారన్నారు. అనూహ్యంగా 35 శాతానికి పెరిగిన ఓటు బ్యాంక్ పెరిగిందని, అధికార పార్టీ డబ్బులతో ప్రలోభాలు పెట్టిందని, అయినా వారికి ఓటు బ్యాంక్ పెరగలేదన్నారు ఈటల రాజేందర్. ఈ ఎన్నికలు ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారం…
పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సమాజానికి తెలుసు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సొంత జిల్లాల్లో ఎమ్మెల్సీ, ఎంపీ గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని, నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదన్నారు. మల్కాజ్ గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు రఘునందన్ రావు. సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరి ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డి…