Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Cm Revanth Reddy Speech At Ysr 75th Birth Anniversary Celebrations

CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published Date :July 8, 2024 , 8:58 pm
By Mahesh Jakki
  • వైఎస్సార్ 75వ జయంతి వేడుకలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఏపీ రాజకీయాలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారం ఉందని.. ప్రతిపక్షం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఉంది కేవలం అధికార పక్షమేనని.. ఏపీలో అందరూ బీజేపీ పక్షమేనన్నారు. ఏపీలో ప్రజల కోసం ఉన్నది వైఎస్ షర్మిల మాత్రమే అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. 2029లో షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ చెప్పారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదన్నారు. ఆశయాలు మోసే వారికి మాత్రమే వారసత్వం వస్తుందన్నారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో కాంగ్రెస్ గెలుపుకు కార్యకర్తలు కోసం తెలంగాణ కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ కి అండగా నిలుస్తామని చెప్పటానికి మంత్రి వర్గంతో సహా ఇక్కడకి వచ్చామన్నారు. కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందని.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్‌కి దెబ్బ తగిలిందో అదే కడప నుంచే మళ్ళీ ఏపీ కాంగ్రెస్ జెండా ఎగరవేయటానికి అండగా ఉంటామన్నారు.

Read Also: TDP: టీటీడీ మాజీ ఈవో, మాజీ చైర్మన్‌పై సీఎస్‌కు ఫిర్యాదు.. విచారణ జరిపించండి..

మణిపూర్ పర్యటన వల్ల రాహుల్ గాంధీ వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడకు రాలేకపోయారని చెప్పారు. తన ప్రతినిధిగా వెళ్ళమని రాహుల్ చెప్పారన్నారు. వైఎస్సార్‌ను శాశ్వతంగా గుర్తు పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని.. వైఎస్సార్ అందరి కుటుంబ సభ్యుడిగా ఉండటమే అందుకు కారణమన్నారు. ఎంత గొప్ప నాయకుడైనా ప్రజల మది నుంచి దూరం అవుతారని.. వైఎస్సార్ మాత్రం చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగినపుడు వైఎస్సార్ లేని లోటుపై చర్చ జరుగుతుందన్నారు. రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రేవంత్ చెప్పారు. మండలిలో బలమైన వాదన వినిపించి వైఎస్సార్ దృష్టిలో పడేందుకు రాత్రంతా ప్రిపేర్ అయ్యే పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. సభలో ప్రశ్నించే వారిని ప్రోత్సహించే విధంగా సమాధానం ఇవ్వాలనేది వైఎస్సార్ విధానమన్నారు. ఇది వైయస్ఆర్ నుంచి మేం నేర్చుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా వైఎస్సార్ వ్యవహరించిన తీరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు చెప్పే సమస్యలు వినేందుకు సీఎంగా వైయస్ఆర్ సమయం ఇచ్చేవారని రేవంత్ వెల్లడించారు.

వైఎస్సార్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని.. రాహుల్ పాదయాత్ర వల్ల కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. 100 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రను రాహుల్ పోషిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ అంటేనే మాట తప్పడు మడమ తిప్పడు అంటూ రేవంత్ పేర్కొన్నారు. 20 ఏళ్లు ప్రతిపక్షంలో కొట్లాడితే ఇపుడు సీఎం అయ్యానన్నారు. ఏపీలో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే షర్మిల కూడా గతంలో వైఎస్సార్ మాదిరి పని చేస్తోందన్నారు. 1999లో వైఎస్సార్ మాదిరి షర్మిల ఇపుడు ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంగా పనిచేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap politics
  • CM Revanth Reddy
  • congress
  • revanth reddy speech

తాజావార్తలు

  • Allu Cinemas: శర్వా బైకర్ సినిమాను ఒక్క దెబ్బకి లేపిన అల్లు సినిమాస్

  • Kuldeep Yadav Marriage: పెళ్లికొడుకు అయిన టీమిండియా స్టార్ క్రికెటర్.. భార్య ఆస్తి ఎంతో తెలుసా?

  • DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్‌గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..

  • Vijay Sethupathi: నేను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలే మిగిల్చాయి

  • Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్‌

ట్రెండింగ్‌

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions