నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మలన్న విజయం దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్కుమార్(తీన్మార్ మల్లన్న) ఆధిక్యంలో ఉన్నారు.
Congress: లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే,
కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు.
ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు.
Graduate MLC Bypoll: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.
ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ గురువారం ధృవీకరించింది. లోక్సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరదని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.
పార్లమెంట్లో కాంగ్రెస్కు మరింత బలం చేకూరింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్సే ఎక్కువ స్థానాలు గెలిచింది. సొంతంగా 99 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది.
బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి విగ్రహాలు తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.