ఉత్తర ప్రదేశ్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మపై ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచి ఇక్కడ ఆమె వెనుకంజలోనే కొనసాగారు. గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపింది. ఇక అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి…
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజల ఫలితాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయం. ఈ పోరాటం మోడీ వర్సెస్ పబ్లిక్ అని ఖర్గే పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమయ్యాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ను తోసిపుచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాని అసలు ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు.
బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా తాము గెలిచామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సారి చెప్తున్నాం.. గెలుపు ఓటములు సహజమన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడి నుంచి శశిథరూర్ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ.. మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హింసాకాండతో చెలరేగిన మణిపూర్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. బీజేపీ, ఎన్పీఎఫ్లు తమ స్థానాలను కోల్పోయేలా కనిపిస్తున్నాయి.
2024 ఎన్నికల పోరులో కాంగ్రెస్ భారీ విజయాన్ని అందుకుంటోంది. గత 10 ఏళ్లలో పార్టీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తరుణంలో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Lok Sabha Election 2024 Results: 2014 నుంచి అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి 2024 లోక్సభ ఎన్నికలు కొత్త ఊపుని ఇచ్చాయి. వరసగా పరాజయాలు, నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లడంతో ఆ పార్టీ డీలా పడిపోయింది.
పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 16 శాతం మంది జాతీయ పార్టీలు, ఆరు శాతం మంది రాష్ట్ర స్థాయి పార్టీలు, 47 శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు. ఈ సమాచారం 'పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్' నివేదికలో ఇవ్వబడింది.
BJP: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి(ఎన్డీయే) ఈసారి 400 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘‘ఆబ్ కీ బార్ 400 పార్’’ నినాదంతో బీజేపీ నేతలు ఎన్నికల బరిలో నిలిచారు.