Rahul Gandhi: హిందుత్వ హింసపై వివాదం.. రాహుల్కు మద్దతుగా జ్యోతిర్ మఠం శంకరాచార్య..!
- హిందుత్వాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టలేదు..
- హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు..
- రాహుల్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసిన వాళ్లను శిక్షించాలి: జ్యోతిర్ మఠం శంకరాచార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ లో ఇటీవల చేసిన హిందుత్వ హింస కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. హిందుత్వాన్ని తప్పుబట్టేలా రాహుల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు.. అతడి ప్రసంగంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి అర్ధ సత్యాలు ప్రచారం చేశారన్నారు. అలాంటి వ్యక్తులను కఠింగా శిక్షించాలని అవిముక్తేశ్వరానంద స్వామి డిమాండ్ చేశారు.
Read Also: Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
అయితే, రాహుల్ గాంధీ ప్రసంగంలోని ‘హింసాత్మక’ వ్యాఖ్యలు కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించి చేసినవే తప్ప హిందుత్వం గురించి కాదని జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి తేల్చి చెప్పారు. దీనిపై రాహుల్ కూడా వివరణ ఇచ్చారు.. మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీని ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేసినట్లు చెప్పారని స్వామిజీ గుర్తు చేశారు.
Read Also: PekaMedaluTrailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..
కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 2వ తేదీన జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమను తాము హిందువులమని చెప్పుకొనే కొందరు 24 గంటలూ హింస, ధ్వేషం, అసత్యం గురించే మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. దేశంలోని హిందువులందరినీ హింసకు పాల్పడే వారిగా రాహుల్ అవమానించారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఆ భాగాన్ని స్పీకర్ ఓం బీర్లా రికార్డుల నుంచి తొలగించింది.
नेता विपक्ष राहुल गांधी के संसद में हिंदू वाले बयान पर ज्योतिष पीठ के शंकराचार्य अविमुक्तेश्वरानंद सरस्वती को सुनिए pic.twitter.com/0p35TOivHT
— Lutyens Media (@LutyensMediaIN) July 7, 2024
తాజావార్తలు
-
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..