Rahul Gandhi: హిందుత్వ హింసపై వివాదం.. రాహుల్కు మద్దతుగా జ్యోతిర్ మఠం శంకరాచార్య..!
- హిందుత్వాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టలేదు..
- హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు..
- రాహుల్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసిన వాళ్లను శిక్షించాలి: జ్యోతిర్ మఠం శంకరాచార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ లో ఇటీవల చేసిన హిందుత్వ హింస కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. హిందుత్వాన్ని తప్పుబట్టేలా రాహుల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు.. అతడి ప్రసంగంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి అర్ధ సత్యాలు ప్రచారం చేశారన్నారు. అలాంటి వ్యక్తులను కఠింగా శిక్షించాలని అవిముక్తేశ్వరానంద స్వామి డిమాండ్ చేశారు.
Read Also: Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
అయితే, రాహుల్ గాంధీ ప్రసంగంలోని ‘హింసాత్మక’ వ్యాఖ్యలు కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించి చేసినవే తప్ప హిందుత్వం గురించి కాదని జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి తేల్చి చెప్పారు. దీనిపై రాహుల్ కూడా వివరణ ఇచ్చారు.. మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీని ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేసినట్లు చెప్పారని స్వామిజీ గుర్తు చేశారు.
Read Also: PekaMedaluTrailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..
కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 2వ తేదీన జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమను తాము హిందువులమని చెప్పుకొనే కొందరు 24 గంటలూ హింస, ధ్వేషం, అసత్యం గురించే మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. దేశంలోని హిందువులందరినీ హింసకు పాల్పడే వారిగా రాహుల్ అవమానించారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఆ భాగాన్ని స్పీకర్ ఓం బీర్లా రికార్డుల నుంచి తొలగించింది.
नेता विपक्ष राहुल गांधी के संसद में हिंदू वाले बयान पर ज्योतिष पीठ के शंकराचार्य अविमुक्तेश्वरानंद सरस्वती को सुनिए pic.twitter.com/0p35TOivHT
— Lutyens Media (@LutyensMediaIN) July 7, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!