సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు చెప్పారు. తాను కూడా ఘటనా స్థలికి వెళ్తున్నట్టు ట్విటర్లో తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే తమిళనాడు మంత్రులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్…
కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చినప్పటినుంచి అన్ని నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ అలాగే వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని కొనుగోలు చేసేందుకు సామాన్య ప్రజలు.. భయపడిపోతున్నారు. ఇక తాజాగా… టమాట ధరలు కూడా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం టమాటో ధరలు కిలో ధర 130 రూపాయలు దాటేసింది. దీంతో ఓటరు కొనేందుకు సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో మందుకు వెళుతున్నారు ఎంకే స్టాలిన్. మొన్నటి వరకు ఆయన చేసిన పనులకు నీరాజనం పట్టిన ప్రజలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. అయితే ఈ నేపథ్యంలో వరదలు సంభవించాయి. దీంతో వరదలను ఎదుర్కొవడంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందంటూ ట్విట్టర్ వేదికగా గోబ్యాక్స్టాలిన్ హ్యాష్ట్యాగ్తో విమర్శలు…
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆ సమీక్షలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… మూడు రోజులపాటు చెన్నైకి ఎవరూ రావొద్దు అని కోరారు. చెన్నై నుంచి ఎవరూ వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అని సూచించారు. ఇక చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సీఎం సెలవుల్లో ఉన్న…
భారీ వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.…
తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. వరద ముంపు భయం చెన్నై వాసుల్ని వెంటాడుతూనే వుంది. పదిరోజులు తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలతో పుయల్, చంబారపాకం డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎం.కే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య అర్థరాత్రి ఓ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఎం స్టాలిన్, ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ అవాక్ చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న రోడ్డుపై తన కాన్వాయ్ వెళ్తుండగా వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్కు సైడ్ ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు…
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు. మంచి సామాజిక…
దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ముసలం మొదలైంది. అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరు ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారగా సొంతపార్టీకి శాపంగా మారింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలుగా విడిపోవడంతో కిందటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలైంది. డీఎంకే అధికారంలోకి రావడానికి అన్నాడీఎంకేలోని లుకలుకలే ప్రధాన కారణమని ఆపార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేను తాను దారిలో పెడుతానని ‘చిన్నమ్మ’ ప్రకటించుకోవడం విశేషం. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాలను…
డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇవాళ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఈ సందర్భంగా కేటీఆర్ కు అందచేశారు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాశారు స్టాలిన్. ఆ లేఖనే ఇవాళ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలన్ గోవన్ మాట్లడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై…