Indian constitution: రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద కామెంట్లు.. వివరణ కోరిన గవర్నర్, సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన నేతలు, ప్రజాప్రతినిధులు భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.. సీఎంలు, మంత్రులు, నేతలు అనే తేడా లేకుండా.. దాని కోసం రాజ్యాంగాన్ని మార్చాలి.. దీనికోసం రాజ్యాంగాన్ని మార్చాల్సిందే నంటూ సందర్భాన్నిబట్టి కామెంట్లు చేస్తూనే ఉన్నారు.. తాజాగా, ఈ జాబితాలో కేరళ మంత్రి సాజి చెరియన్ చేరారు.. మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని మంత్రి విమర్శించారు. దీని కారణంగానే కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. అంతేకాదు.. మరో ముందడుగు వేసిన ఆయన.. బ్రిటీష్ వారు రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని.. ఎవరు దీనికి విరుద్ధంగా మాట్లాడినా తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు మంత్రి చెరియన్.
Read Also: Asaduddin Owaisi: పెట్రోల్ రేటు పెరగడానికి తాజ్మహలే కారణం
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
అయితే, మంత్రి చెరియన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్తో పాటు సీఎం పినరయి విజయన్ వివరణ కోరారు.. దేశ రాజ్యాంగం ప్రజలను, సామాన్యులను దోచుకోవడానికి దోహదపడిందనే తరహాలో మంత్రి వ్యాఖ్యలు ఉండడంతో.. రాజ్యాంగాన్ని మంత్రి చెరియన్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మంత్రి సాజీ చెరియన్ను ముఖ్యమంత్రి వెంటనే బహిష్కరించాలని.. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామిని హెచ్చరించారు.. అయితే, రాజ్యాంగంపై మంత్రి సాజీ చెరియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరణ కోరారు. ఈ వ్యవహారంపై రాజ్భవన్ జోక్యం చేసుకోవడంతో వివరణ ఇవ్వాలని మంత్రిని కోరారు సీఎం. కాగా, రాజ్యాంగాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వాన్ని విమర్శించడమేనని మంత్రి స్పందించినట్లు సమాచారం. మంత్రి సాజి చెరియన్ ప్రసంగం వివాదాస్పదంగా మారడంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు త్వరలో మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?