Indian constitution: రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద కామెంట్లు.. వివరణ కోరిన గవర్నర్, సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన నేతలు, ప్రజాప్రతినిధులు భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.. సీఎంలు, మంత్రులు, నేతలు అనే తేడా లేకుండా.. దాని కోసం రాజ్యాంగాన్ని మార్చాలి.. దీనికోసం రాజ్యాంగాన్ని మార్చాల్సిందే నంటూ సందర్భాన్నిబట్టి కామెంట్లు చేస్తూనే ఉన్నారు.. తాజాగా, ఈ జాబితాలో కేరళ మంత్రి సాజి చెరియన్ చేరారు.. మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని మంత్రి విమర్శించారు. దీని కారణంగానే కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. అంతేకాదు.. మరో ముందడుగు వేసిన ఆయన.. బ్రిటీష్ వారు రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని.. ఎవరు దీనికి విరుద్ధంగా మాట్లాడినా తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు మంత్రి చెరియన్.
Read Also: Asaduddin Owaisi: పెట్రోల్ రేటు పెరగడానికి తాజ్మహలే కారణం
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
అయితే, మంత్రి చెరియన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్తో పాటు సీఎం పినరయి విజయన్ వివరణ కోరారు.. దేశ రాజ్యాంగం ప్రజలను, సామాన్యులను దోచుకోవడానికి దోహదపడిందనే తరహాలో మంత్రి వ్యాఖ్యలు ఉండడంతో.. రాజ్యాంగాన్ని మంత్రి చెరియన్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మంత్రి సాజీ చెరియన్ను ముఖ్యమంత్రి వెంటనే బహిష్కరించాలని.. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామిని హెచ్చరించారు.. అయితే, రాజ్యాంగంపై మంత్రి సాజీ చెరియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరణ కోరారు. ఈ వ్యవహారంపై రాజ్భవన్ జోక్యం చేసుకోవడంతో వివరణ ఇవ్వాలని మంత్రిని కోరారు సీఎం. కాగా, రాజ్యాంగాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వాన్ని విమర్శించడమేనని మంత్రి స్పందించినట్లు సమాచారం. మంత్రి సాజి చెరియన్ ప్రసంగం వివాదాస్పదంగా మారడంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు త్వరలో మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!