PM Modi: లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి, ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే భారీ ప్లాన్తో కూటమి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్గా వారణాసిలో ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రముఖుల్ని బరిలో దించేందుకు కూటమి భావిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
CM Nitish Kumar: ఇటీవల కాలంలో హిందీ భాష వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు నాయకులు ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీ నాయకులు హిందీ భాషను తమపై రుద్దొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గోవాల ఎయిర్ పోర్టులో ఓ తమిళ మహిళకి హిందీ రాకపోవడంపై అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అవహేనగా మాట్లాడారంటూ.. ఏకంగా సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
INDIA bloc: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఇండియా కూటమిపై అడిగిన ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నితీష్ కుమార్పై బీజేపీ విమర్శలకు దిగింది. ఈ వ్యవహారం బీహార్లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ‘‘ఇండియా’’ కూటమి పేరును విస్తరించాలని కోరింది.
India Bloc: కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. బుధవారం కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు రావడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది. అయితే నేపథ్యంలో కీలక రాష్ట్రాల్లో దారుణ ఓటమి తర్వాత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునివ్వగా బీహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్…
Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు.
PM Modi: జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
CM Nitish Kumar: కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్కి మద్దతు తెలుపుతున్నాయి.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభాను పెంచారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
INDIA bloc: 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కూటమిలోని పార్టీలన్నీ మూడు సమావేశాలను నిర్వహించాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇండియా కూటమిలోని పలువురు మిత్రపక్షాల నేతలు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించలేదని సమాజ్ వాదీ పార్టీ(చీఫ్) అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.