CM Nitish Kumar: నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ధ్వజం.. నేనే భారతీయురాలినై ఉంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు.
ఇదిలా ఉంటే ఇప్పటి ఈ మాటల మంటలు చల్లారడం లేదు. బుధవారం ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు’’ అంటూ ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు స్పందించకపోవడంపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ నితీష్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు. తాను భారతీయురాలినై ఉంటే.. ఆయన రాష్ట్రానికి వెళ్లి పోటీ చేస్తానని అన్నారు. ఆమె 2024 ఎన్నిలక గురించి, ప్రధాని మోడీ నాయకత్వం గురించి ప్రశంసించారు. మహిళా సాధికారత గురించి మోడీ చేసిన ప్రయత్నాలను గురించి ఎక్స్(ట్విట్టర్)లో మాట్లాడారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
Read Also: Bengaluru : బెంగళూరులో భారీ వర్షాలు.. కూలిపోయిన పోలీసు ఆయుధశాల..
మిల్బెన్ వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్) నేత ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమెపై సెటైర్లు వేశారు. ‘‘ మేరీ మిల్బెన్కి మణిపూర్పై అభిప్రాయం ఉంది. బీహార్ సీఎం గురించి అభిప్రాయం ఉంది. 2024లో ఎవరికి ఓటేయాలనే దానిపై కూడా ఆమెకు ఒక అభిప్రాయం ఉంది. మేరీ మీరు యూఎస్ పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశ పౌరసత్వం పొందాలి. తద్వారా మోడీజీ సర్కార్ మాయాజాలాన్ని నిజంగా చూడొచ్చు. అప్పటి వరకు మేడమ్ దయచేసి కూర్చోండి’’ అంటూ పోస్ట్ చేసింది.
గతంలో మేరీ అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాదాలనపు తాకి వార్తల్లో నిలిచారు. గతంలో ప్రధాని మోడీకి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. బీహార్లో నాయకత్వం వహించేందుకు ఓ మహిళకు అధికారం ఇవ్వాలని బీజేపీని కోరారు. అంతకుముందు మేరీ మిల్బెన్ తన ట్వీట్ లో..‘‘ ఈ రోజు ఇండియాలోని బీహార్ ఒక నిర్ణయాత్మక ఘట్టాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడి మహిళల విలువ సవాల్ చేయబడుతోంది. దీనికి ఒకే సమాధానం ఉందని నేను నమ్ముతాను. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యల తర్వాత ధైర్యవంతులైన మహిళలు ముందుకు రావాలి. బీహార్ సీఎంగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించండి. నేను ఒకవేళ భారతీయ పౌరురాలినైతే బీహార్ వెళ్లి ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను’’ అని వీడియోలో పేర్కొంది.
బీహార్ అసెంబ్లీలో కులగణనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ గురించి ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయిందని, లైంగిక సంపర్కం సమయంలో స్త్రీకి తమ భర్తలను ఎలా నిరోధించాలో వివరించారు. భర్తలు చేసిన చర్యలు మరిన్ని జననాలకు దారి తీశాయని, అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా అడ్డుకోవాలో తెలుసని, అందుకే జననాలు తగ్గాయని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం వివాదంగా మారింది.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..