India Bloc: ఇండియా కూటమి భేటీ.. కాంగ్రెస్ పిలుపుకు కీలక నేతలు గైర్హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bloc: కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. బుధవారం కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశానికి కీలక నేతలు రావడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది. అయితే నేపథ్యంలో కీలక రాష్ట్రాల్లో దారుణ ఓటమి తర్వాత కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునివ్వగా బీహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఈ మీటింగ్ని దాటవేయాలని అనుకుంటున్నారు.
మరోవైపు కూటమిలో కీలక నేతగా ఉన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరుకావడం లేదని తెలుస్తోంది. మైచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు సీఎం స్టాలిన్ రావడం లేదు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో కీలక నేతల గైర్హాజరుతో ఇండియా బ్లాక్ సమావేశం వాయిదా పడింది. కూటమిలో కీలక సభ్యుల సంప్రదించి రెండు వారాల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..
2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ మూడు కీలక రాష్ట్రాల్లో ఓడిపోవడం కూటమిపై ప్రభావాన్ని చూపించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇలా ఓడిపోవడం, ముఖ్యంగా హిందీ బెల్టు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం కాంగ్రెస్కి పెద్ద దెబ్బ. అయితే ఎంపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీలో సీట్ల పంపకాలపై విభేదాల కారణంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్కి అంటీముట్టనట్లు ఉంటున్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ, జేడీయూ, టీఎంసీ, ఆప్, డీఎంకే, జేఎంఎం పార్టీలతో పాటు కమ్యూనిస్ట్, ఇతర చిన్నాచితక పార్టీలు కూటమిని ఏర్పాటు చేశాయి. వీటి తొలిసమావేశం పాట్నాలో జరగగా, బెంగళూర్, ముంబైలో తర్వాత సమావేశాలు జరిగాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు కూటమిలో చర్చ జరగలేదు.
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!