PM Modi: వారణాసిలో మోడీని ఓడించేందుకు ఇండియా కూటమి బిగ్ ప్లాన్.. పోటీలో ఉండేది వీళ్లేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి, ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే భారీ ప్లాన్తో కూటమి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్గా వారణాసిలో ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రముఖుల్ని బరిలో దించేందుకు కూటమి భావిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వారణాసిలో 1991 నుంచి బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఒక్క 2004లో తప్పితే అన్ని సార్లు బీజేపీనే గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి మోడీ పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ సారి 2024 ఎన్నికల్లో ప్రధానిని వారణాసి నుంచి ఓడించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Lalu Yadav: “ల్యాండ్ ఫర్ జాబ్” స్కామ్.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు..
అయితే, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్లను పోటీలోకి దింపడానికి పరిశీలిస్తున్నట్లు సమచారం. గతంలో బీజేపీకి మిత్రుడిగా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలిగి, ఇండియా కూటమిలో చేరారు. కూటమి తరుపున ప్రధాని రేసుల్లో వినిపిస్తున్న పేర్లలో నితీష్ కుమార్ పేరు కూడా ఒకటి. తనకు ప్రధాని కావాలనే ఆశ లేదని ఇతను పలుమార్లు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి 2019లోనే వారణాసి నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు, కానీ చివరకు మరోసారి కాంగ్రెస్ అజయ్ రాయ్ని రంగంలోకి దించింది. ప్రధాని కన్నా 5 లక్షల ఓట్ల తేడాతో మూడోస్థానంలో నిలిచారు. అయితే ఈసారి ఆమెను బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇండియా కూటమి మూడో వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014లో ప్రధాని మోడీపై వారణాసి నుంచి ఆప్ తరుపున కేజ్రీవాల్ బరిలో నిలిచి 2 లక్షల ఓట్లు, దాదాపుగా 20 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా టీఎంసీ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించగా.. కేజ్రీవాల్ సపోర్ట్ చేశారు. అయితే ముందు ఎన్నికల్లో గెలవాలని ఖర్గే అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..