కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు వారితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. దీంతో ఈ మీటింగ్ కు సర్వాత్ర ఆసక్తి నెలకొంది.